Copper Price: బంగారం, వెండి మాత్రమే కాదు.. రాగి ధరలు కూడా రికార్డు స్థాయికి..!
- ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్న రాగి ధరలు..
- అంతర్జాతీయ మార్కెట్లో టన్ను రాగి 12000 డాలర్లు..
- ఎంసీఎక్స్లో కిలో రూ.1140-రూ.1160 మధ్య ట్రేడ్..
- సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుదల..
- ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో రాగికి డిమాండ్ ..
- 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Copper Price: అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను 12000 డాలర్లు దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలోని MCXలో దాదాపు కిలో రాగి 1140 రూపాయల నుంచి 1160 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. 2025లో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగింది.
Read Also: Off The Record: కర్నూలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. ఆశావహులకు తప్పని నిరాశ..!
Also Read
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
- Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీని వల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ధరలు పెరగడానికి ఇది మరోక కారణం. గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, తక్కువ పెట్టుబడులు, డిమాండ్కు తగినంత సరఫరా లేకపోవడం. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. సరఫరా సమస్యల కారణంగా పెట్టుబడిదారులు రాగిని కొనుగోలు చేస్తున్నారు. రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా మూడు రంగాలు కారణమవుతున్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు. సాధారణ పెట్రోల్ కార్ కంటే ఎలక్ట్రిక్ కార్ తయారీలో దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో కీలకం. మూడవది, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు. ఈ రంగాల విస్తరణ వల్ల 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపర్ రేట్లు పెరుగుతుండటంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటల్ అయిన కాపర్పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.
కాగా, బంగారం, వెండి ధరలు మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. మరోసారి లక్షా 40 వేల మార్క్కు చేరుకుంది గోల్డ్. ఈ మార్క్కు గోల్డ్ రేటు చేసుకోవడం ఈ వారంలో ఇది రెండోసారి. ఈ వారం ప్రారంభం నుంచే బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోన్నాయి. వేలకు వేలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులకు భారంగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఏకంగా తులం బంగారంపై 770 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగి లక్షా 40వేల 20 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగి లక్షా 28వేల 350 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు అదే జోరును కొనసాగిస్తున్నాయి. యూఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.5 శాతం పెరిగి ఔన్సు 4,501.44 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మొత్తం మీద బంగారం ధరలు 70 శాతానికి పైగా పెరిగాయి.
వెండి విషయంలో అయితే ధరల పెరుగుదల మరింత వేగంగా సాగుతోంది. వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లోనూ వెండి ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. మార్చి వెండి ఫ్యూచర్స్ దాదాపు 4 శాతం పెరిగి కిలోకు 2లక్షల 32వేల 741 రూపాయలకు చేరింది. హైదరాబాద్లో శుక్రవారం కేజీ ధర ఏకంగా 2 లక్షల 37వేలు పలికింది. 2025 ప్రారంభం నుంచి వెండి ధర దాదాపు 158 శాతం వరకు పెరిగింది. 2025 జనవరి 1న కేజీ వెండి 90,500 పలికింది. సరిగ్గా 2025 డిసెంబర్ 26న కేజీ వెండి ధర 2 లక్షల 37వేలు పలుకుతోంది. దీన్నిబట్టి వెండి ధర ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బంగారాన్ని కూడా మించి వెండిపై రాబడులు రావడం పెట్టుబడిదారుల ఆసక్తిని మరింత పెంచింది. బలమైన పెట్టుబడి డిమాండ్, వెండిని అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చడం, అలాగే మోమెంటమ్ ఆధారిత కొనుగోళ్లు వెండి ధరలకు ప్రధాన బలంగా మారాయి. వెనిజులా నుంచి ముడి చమురు రవాణాను అడ్డుకుంటూ అమెరికా విధించిన ఆంక్షలు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, నైజీరియాలోని ISIS స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత, ద్రవ్యోల్బణం, కార్మిక మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటం. ఈ కారణాలన్నీ బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!