పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇటీవల ధరలు భారీగా పెరిగిపోయాయి. శుభకార్యాల సమయంలో పెరిగిపోవడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. మొత్తానికి శివరాత్రి సమయానికి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తులం గోల్డ్పై రూ.2,620 తగ్గగా.. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Triangle Love: వాలెంటైన్ డేకు ముందు ఘోరం.. ట్రయాంగిల్ లవ్లో ఎంత ఘోరానికి తెగబడిందంటే..!
తులం గోల్డ్పై రూ.2,620 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,400 తగ్గడంతో రూ.1,42,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,960 తగ్గడంతో రూ.1,16,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ
హమ్మయ్య వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2, 80, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,80, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.