JRD Tata: భారత్ లో ఉద్యోగులకు తొలిసారి 8 గంటల డ్యూటీ..ఉచిత వైద్యం కల్పించింది ఈయనే..
- పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా జయంతి
- టాటా గ్రూప్కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్గా పనిచేసిన జేఆర్డీ టాటా
- 34 సంవత్సరాల వయసులో బాధ్యతలు
- భారతరత్న పొందిన తొలి పారిశ్రామిక వేత్త జేఆర్డీ
- ఆయన పేరుమీద ఎన్నో రికార్డులు
నేడు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా అంటే జేఆర్డీ టాటా జయంతి. అతను 29 జూలై 1904న జన్మించాడు. జేఆర్డీ టాటా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్గా ఉన్నారు. ఆయన కేవలం 34 సంవత్సరాల వయస్సులో 1938లో టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 1991 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన టాటా గ్రూప్ అత్యంత విజయవంతమైన ఛైర్మన్గా గుర్తింపుపొందారు. ఈ సమయంలో.. ఆయన టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం అనేక విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. వాటిని ఇతర కంపెనీలు కూడా అనుసరించాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక పారిశ్రామికవేత్తకు మాత్రమే భారతరత్న లభించింది. అది జేఆర్డీ టాటాకు మాత్రమే. ఆయనకు 1992లో దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. జేఆర్డీ జీవితంలో స్పృశించని కొన్ని అంశాలను ఇప్పుడు నెమరేసుకుందాం.
READ MORE: CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
Also Read
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
- Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
- Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
జేఆర్డీ.. రతన్ దాదాభోయ్ టాటా.. సుజానే బ్రియర్లకు రెండవ సంతానం. భారతదేశంలో కారు నడిపిన మొదటి మహిళ ఆయన తల్లే. ఆమె ఫ్రెంచ్, కాబట్టి జేఆర్డీ టాటా చిన్నతనంలో ఎక్కువ భాగం ఫ్రాన్స్లో గడిచింది. అక్కడే ఆయనకు విమానాలపై ఆసక్తి ఏర్పడింది. 15 సంవత్సరాల వయస్సులో.. జేఆర్డీ పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కల నెరవేరాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే. బొంబాయిలో మొదటి ఫ్లయింగ్ క్లబ్ ప్రారంభించినప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలు. 1929 లో తన పైలట్ లైసెన్స్ పొందారు. భారతదేశంలో తొలిసారిగా పైలట్ లైసెన్స్ ఒకరికి జారీ చేయబడింది. ఈ విధంగా ఆయన భారతదేశంలో పౌర విమానయానానికి పితామహుడిగా మారారు.
READ MORE:Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..
విమానయాన రంగానికి పితామహుడు..
జేఆర్డీ టాటా ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు. 1930లో, ఆయన ఆగాఖాన్ అవార్డుకు హాజరయ్యేందుకు భారతదేశం నుంచి ఇంగ్లండ్కు ఒంటరిగా ప్రయాణించారు. కేవలం రెండు సంవత్సరాల తరువాత.. ఆయన టాటా ఎయిర్లైన్స్ను స్థాపించారు. ఇది భారతదేశపు మొదటి విమానయాన సంస్థ. తరువాత ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంది. అది ఎయిర్ ఇండియాగా మారింది. 1932లో.. జేఆర్డీ టాటా భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య విమానాన్ని నడిపిన గౌరవాన్ని పొందారు. ఈ విమానం కరాచీ నుంచి బయలుదేరి ముంబైలో దిగింది. భారత్లో తొలి విమాన సర్వీసు ఇలా మొదలైంది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్లోకి తిరిగి వచ్చింది.
READ MORE:Tamil Nadu: 24 గంటల్లో మూడు వేర్వేరు పార్టీల నేతలు హత్య.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు
బ్రాండ్ కస్టోడియన్ హరీష్ భట్ కొన్ని సంవత్సరాల క్రితం జేఆర్డీ టాటా జీవితంలోని ఒక సంఘటనను పంచుకున్నారు. దీని ప్రకారం.. ఒకసారి జేఆర్డీ ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నారు. ఆయన పక్కనే ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎల్కే ఝా కూర్చున్నారు. అకస్మాత్తుగా జేఆర్డీ తన సీటును వదిలి గంట తర్వాత తిరిగి వచ్చారు. ఎక్కడికి వెళ్లారని ఎల్కే ఝా అడిగారు. దీనికి జేఆర్డీ టాటా బదులిస్తూ టాయిలెట్ శుభ్రంగా ఉందో లేదో చూసేందుకు వెళ్లాను. చూడటానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ఝా ప్రశ్నించారు. అప్పుడు టాయిలెట్ పేపర్ సరిగా అమర్చలేదని, సరిచేస్తున్నానని సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!