JRD Tata: భారత్ లో ఉద్యోగులకు తొలిసారి 8 గంటల డ్యూటీ..ఉచిత వైద్యం కల్పించింది ఈయనే..
- పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా జయంతి
- టాటా గ్రూప్కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్గా పనిచేసిన జేఆర్డీ టాటా
- 34 సంవత్సరాల వయసులో బాధ్యతలు
- భారతరత్న పొందిన తొలి పారిశ్రామిక వేత్త జేఆర్డీ
- ఆయన పేరుమీద ఎన్నో రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త జహంగీర్ రతన్జీ దాదాభోయ్ టాటా అంటే జేఆర్డీ టాటా జయంతి. అతను 29 జూలై 1904న జన్మించాడు. జేఆర్డీ టాటా దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా గ్రూప్కు సుమారు 53 సంవత్సరాల పాటు ఛైర్మన్గా ఉన్నారు. ఆయన కేవలం 34 సంవత్సరాల వయస్సులో 1938లో టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. 1991 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఆయన టాటా గ్రూప్ అత్యంత విజయవంతమైన ఛైర్మన్గా గుర్తింపుపొందారు. ఈ సమయంలో.. ఆయన టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం అనేక విప్లవాత్మక పథకాలను ప్రారంభించారు. వాటిని ఇతర కంపెనీలు కూడా అనుసరించాయి. ఇప్పటి వరకు దేశంలో ఒక పారిశ్రామికవేత్తకు మాత్రమే భారతరత్న లభించింది. అది జేఆర్డీ టాటాకు మాత్రమే. ఆయనకు 1992లో దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. జేఆర్డీ జీవితంలో స్పృశించని కొన్ని అంశాలను ఇప్పుడు నెమరేసుకుందాం.
READ MORE: CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
Also Read
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
జేఆర్డీ.. రతన్ దాదాభోయ్ టాటా.. సుజానే బ్రియర్లకు రెండవ సంతానం. భారతదేశంలో కారు నడిపిన మొదటి మహిళ ఆయన తల్లే. ఆమె ఫ్రెంచ్, కాబట్టి జేఆర్డీ టాటా చిన్నతనంలో ఎక్కువ భాగం ఫ్రాన్స్లో గడిచింది. అక్కడే ఆయనకు విమానాలపై ఆసక్తి ఏర్పడింది. 15 సంవత్సరాల వయస్సులో.. జేఆర్డీ పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. అయితే తన కల నెరవేరాలంటే తొమ్మిదేళ్లు ఆగాల్సిందే. బొంబాయిలో మొదటి ఫ్లయింగ్ క్లబ్ ప్రారంభించినప్పుడు అతని వయస్సు 24 సంవత్సరాలు. 1929 లో తన పైలట్ లైసెన్స్ పొందారు. భారతదేశంలో తొలిసారిగా పైలట్ లైసెన్స్ ఒకరికి జారీ చేయబడింది. ఈ విధంగా ఆయన భారతదేశంలో పౌర విమానయానానికి పితామహుడిగా మారారు.
READ MORE:Paris Olympics 2024: టెన్నిస్ ఆటగాళ్లకు షాక్.. మొదటి రౌండ్ లోనే భారత్ అవుట్..
విమానయాన రంగానికి పితామహుడు..
జేఆర్డీ టాటా ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయుడు. 1930లో, ఆయన ఆగాఖాన్ అవార్డుకు హాజరయ్యేందుకు భారతదేశం నుంచి ఇంగ్లండ్కు ఒంటరిగా ప్రయాణించారు. కేవలం రెండు సంవత్సరాల తరువాత.. ఆయన టాటా ఎయిర్లైన్స్ను స్థాపించారు. ఇది భారతదేశపు మొదటి విమానయాన సంస్థ. తరువాత ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంది. అది ఎయిర్ ఇండియాగా మారింది. 1932లో.. జేఆర్డీ టాటా భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య విమానాన్ని నడిపిన గౌరవాన్ని పొందారు. ఈ విమానం కరాచీ నుంచి బయలుదేరి ముంబైలో దిగింది. భారత్లో తొలి విమాన సర్వీసు ఇలా మొదలైంది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్లోకి తిరిగి వచ్చింది.
READ MORE:Tamil Nadu: 24 గంటల్లో మూడు వేర్వేరు పార్టీల నేతలు హత్య.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు
బ్రాండ్ కస్టోడియన్ హరీష్ భట్ కొన్ని సంవత్సరాల క్రితం జేఆర్డీ టాటా జీవితంలోని ఒక సంఘటనను పంచుకున్నారు. దీని ప్రకారం.. ఒకసారి జేఆర్డీ ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నారు. ఆయన పక్కనే ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎల్కే ఝా కూర్చున్నారు. అకస్మాత్తుగా జేఆర్డీ తన సీటును వదిలి గంట తర్వాత తిరిగి వచ్చారు. ఎక్కడికి వెళ్లారని ఎల్కే ఝా అడిగారు. దీనికి జేఆర్డీ టాటా బదులిస్తూ టాయిలెట్ శుభ్రంగా ఉందో లేదో చూసేందుకు వెళ్లాను. చూడటానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ఝా ప్రశ్నించారు. అప్పుడు టాయిలెట్ పేపర్ సరిగా అమర్చలేదని, సరిచేస్తున్నానని సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!