Tamil Nadu: 24 గంటల్లో మూడు వేర్వేరు పార్టీల నేతలు హత్య.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో 24 గంటల వ్యవధిలో మూడు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయమై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. తమిళనాడులో అరాచక వాతావరణం ఉందని, సీఎం ఎంకే స్టాలిన్ అసమర్థుడని ఆరోపించారు. అధికార డీఎంకేకు చెందిన వ్యక్తులు అరాచకాలు సాగిస్తున్నారని, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా పోలీసులు కూడా వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఏఐఏడీఎంకే ఆరోపించింది.
‘రాష్ట్రంలో అరాచక వాతావరణం’
ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ ’24 గంటల్లోనే తమిళనాడులో మూడు రాజకీయ పార్టీల నేతలు హత్యకు గురయ్యారు. మృతి చెందిన వారిలో ఒకరు ఏఐఏడీఎంకే నేత కాగా, మరొకరు బీజేపీ నేత, మూడో వ్యక్తి కాంగ్రెస్ నేత. తమిళనాడులో అరాచక వాతావరణం నెలకొందని, సీఎం ఎంకే స్టాలిన్ పూర్తిగా అసమర్థుడని నిరూపిస్తున్నారని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న, శాంతిభద్రతలను ఉల్లంఘిస్తున్న వ్యక్తులు కూడా డీఎంకేకు చెందినవారే. అధికార పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవద్దని పార్టీ హైకమాండ్ పోలీసులను ఆదేశించినందున పోలీసులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
Also Read
ఇండియా కూటమిని టార్గెట్ చేసిన బీజేపీ
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ ‘తమిళనాడులో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయి. జులై ప్రారంభంలో దళిత నాయకుడు బీఎస్పీ ఆర్మ్స్ట్రాంగ్ని దారుణంగా హత్య చేసిన తర్వాత… గత మూడు రోజుల్లో వరుసగా బీజేపీ నాయకుడు, అన్నాడీఎంకే నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి రాజకీయ హత్యలను మనం చూశాం. శాంతిభద్రతలు ఎంకే స్టాలిన్ నియంత్రణలో లేవని, అయితే రాహుల్ గాంధీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకునే సమయం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. దీనిపై ఇండియా కూటమికి ఎలాంటి వైఖరి లేదు. ఇది కూటమి ద్వంద్వ ఎజెండా… తనకు అసౌకర్యంగా ఉన్న అంశంపై మాట్లాడటం కూటమి పిరికితనాన్ని చూపుతుందన్నారు.
బీజేపీ నేత తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ.. ‘తమిళనాడులో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయి. ప్రతిరోజూ రాజకీయ హత్యల వార్తలు చూస్తూనే ఉంటాం. ఈ ఉదయం శివగంగైలో అన్నాడీఎంకే కార్యకర్త, బీజేపీ కార్యకర్త హత్యకు గురైన వార్త చూశాం. వారు (రాష్ట్ర ప్రభుత్వం) శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలి. కేవలం అధికారులను, కలెక్టర్లను మార్చడం పరిష్కారం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి సమావేశాలను బహిష్కరించినప్పుడు తమిళనాడు అభివృద్ధిని బహిష్కరిస్తారు.’ అన్నారు.
డీఎంకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
తమిళనాడులో ముగ్గురు స్థానిక నేతల హత్యపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ మాట్లాడుతూ, ‘తమిళనాడులో ఇది చాలా దురదృష్టకర సంఘటన. రాజకీయ నాయకులు వివిధ పార్టీలకు చెందిన వారని మనందరికీ తెలుసు. ఇది రాజకీయ హత్య కాదు, ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు, మరొకరితో వ్యక్తిగత శత్రుత్వ సంఘటనలున్నాయి. అన్ని హత్యలను ఒకే రంగులో చిత్రించలేము. ప్రతి కేసు ఒక్కో కోణంలో ఉంటుంది. తమిళనాడు పోలీసులు ఆ సమస్యలను పరిష్కరించాలి. గత 2-3 నెలల్లో దాదాపు 6 రాజకీయ వ్యక్తుల హత్యలు జరిగినందున పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము. అసలు నిందితులను గుర్తించేందుకు తమిళనాడు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
వేర్వేరు ఘటనల్లో వివిధ పార్టీల నేతల హత్య
తమిళనాడులోని శివగంగ ప్రాంతంలో శనివారం రాత్రి బీజేపీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన నాయకుడు శివగంగై బీజేపీ జిల్లా కార్యదర్శి. బిజెపి నాయకుడు తన ఇటుక బట్టీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, కొంతమంది సాయుధ వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ.. ‘సంఘ వ్యతిరేకులకు ప్రభుత్వానికి, పోలీసులంటే భయం లేదని అన్నారు. పోలీసులు సీఎం అధీనంలో ఉండి ఇంత రాజకీయ డ్రామా చేస్తున్నారు. మరో ఘటనలో కడలూరు ప్రాంతంలో ఏఐఏడీఎంకే కార్యకర్త హత్యకు గురయ్యాడు. బాధితుడిని పద్మనాభన్గా గుర్తించారు. ఏఐఏడీఎంకే నేతపై కొందరు సాయుధ వ్యక్తులు దాడి చేసి కొట్టి చంపారు.
తాజావార్తలు
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?