EPFO: ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈపీఎఫ్ఓ నుంచి కీలక అప్డేట్.. ఇక సులువుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారుల కోసం శుభవార్త తీసుకొచ్చింది. పాత, నిరుపయోగంగా ఉన్న పీఎఫ్ ఖాతాల గుర్తింపు, క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం ఒక కీలక ప్రకటన చేశారు.
ఈ-ప్రాప్తి (E-PRAAPTI) పోర్టల్ ఆవిష్కరణ..
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
ఉద్యోగులు తమ పాత మరియు ఇన్-ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయడానికి, యాక్టివేట్ చేయడానికి వీలుగా ‘ఈ-ప్రాప్తి’ (E-PRAAPTI) అనే కొత్త వెబ్ పోర్టల్ను త్వరలో ప్రారంభించనున్నారు. దీని పూర్తి పేరు ‘ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్-బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్’. 2014 కంటే ముందు యూఏఎన్ (UAN) లేని ఖాతాలను కలిగిన వారు కూడా ఆధార్ ధృవీకరణ ద్వారా తమ పాత ఖాతాలను గుర్తించి, ప్రస్తుత యూఏఎన్తో అనుసంధానం చేసుకోవచ్చు. తొలి దశలో ఇది మెంబర్ ఐడీ ఆధారంగా పనిచేస్తుంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్వో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. ఇందులో సుమారు 5.51 కోట్ల క్లెయిమ్లు అడ్వాన్స్ లేదా పాక్షిక విత్డ్రాయల్స్ కావడం గమనార్హం. 71.11 శాతం అడ్వాన్స్ క్లెయిమ్లు కేవలం 3 రోజుల్లోనే ఆటో మోడ్ ద్వారా పూర్తయ్యాయి. 6.68 కోట్ల మంది సభ్యులు చెక్కు ఇమేజ్ అప్లోడ్ చేసే అవసరం లేకుండానే క్లెయిమ్లు దాఖలు చేశారు. 1.59 కోట్ల మంది సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలను యజమాని అనుమతి లేకుండానే సీడింగ్ చేసుకోగలిగారు.
ఏప్రిల్ 2026లో 61.03 లక్షల క్లెయిమ్లు పరిష్కారమవగా, అందులో 98.70 శాతం క్లెయిమ్లు 20 రోజుల కంటే తక్కువ సమయంలోనే పూర్తయ్యాయి. ఈ సంస్కరణల ద్వారా మన్యువల్ జోక్యం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాత ఐడీలు గుర్తులేని వారు కూడా ఈ సేవలను పొందేలా పోర్టల్ను విస్తరించనున్నారు.
తాజావార్తలు
-
Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!