EarlySalary rebranded as ‘Fibe’: పేరు మారిన ‘ఎర్లీ శాలరీ’. ‘ఫైబ్’గా రీబ్రాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EarlySalary rebranded as ‘Fibe’: డిజిటల్ లెండింగ్ స్టార్టప్ ఎర్లీ శాలరీ పేరు మారింది. ‘ఫైబ్’ అనే కొత్త పేరుతో రీబ్రాండింగ్ చేసుకుంటోంది. విస్తరణ ప్రణాళికను కూడా అమలుచేస్తోంది. గతంలో 18 సిటీల్లో మాత్రమే సర్వీసులు అందుబాటులో ఉండగా ఆ సంఖ్యను 150కి పెంచింది. ఇంతకుముందు ప్రతి నెలా 35 వేల మంది కొత్త వినియోగదార్లనే చేర్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు కస్టమర్ బేస్ని ఏకంగా లక్షకు పెంచటం విశేషం. తద్వారా వచ్చే ఐదేళ్లలో రెండున్నర బిలియన్ డాలర్ల విలువైన ‘నిర్వహణలో ఉన్న ఆస్తులను’ సాధించటం ద్వారా తన ఉనికిని పటిష్టం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులు ఈమధ్య ఇలాంటి యాప్ బేస్డ్ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో.. ఎర్లీ శాలరీ (ఫైబ్) బాగా పాపులర్ అయిన లోన్ యాప్ల్లో ఒకటిగా నిలిచింది.
టీవీఎస్ స్కాలర్షిప్లు
Also Read
- Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ ముందుకొచ్చింది. ఫారన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. లీడర్స్గా మరియు డెసిజన్ మేకర్స్గా ఎదిగేందుకు తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను ప్రదర్శించే అభ్యర్థులను దేశాల వారీగా ఎంపిక చేస్తామని సంస్థ ఎండీ సుదర్శన్ వేణు తెలిపారు. FCDOతో మరియు బ్రిటన్ ప్రభుత్వంతో కలిసి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్లు చెప్పారు. భవిష్యత్ నాయకులను తయారుచేసేందుకు మరియు ఆ అభ్యర్థులకు తమ జర్నీలో ససోర్ట్ చేసేందుకు నిబద్ధతతో పాటుపడతామని పేర్కొన్నారు.
read also: Hero Ramcharan for Hero Company: హీరో విత్ ‘హీరో’. కొత్త బ్రాండ్ అంబాసిడర్గా రామ్చరణ్
కేంద్రానికి పన్నుల ఊరట
కేంద్ర ప్రభుత్వానికి ఆర్థికంగా కాస్త ఊరట లభించింది. జీఎస్టీతోపాటు ఇతర పన్నుల వసూళ్లు గతేడాది కన్నా ఈసారి 30 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో మార్కెట్ నుంచి రుణాలను కొంచెం తక్కువే తీసుకోవాలని నిర్ణయించుకుంది. 14.31 లక్షల కోట్ల లోన్ తీసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు దాన్ని 14.21 లక్షల కోట్లకు తగ్గించుకుంది. వచ్చే ఏడాది మార్చితో ముగిసే అర్ధ వార్షికంలో 5.92 లక్షల కోట్లు మాత్రమే రుణం సేకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!