Debt: దేశంలో ప్రతి వ్యక్తి పై ఎన్ని లక్షల అప్పు ఉందో తెలిస్తే షాక్ అవుతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Debt:దేశంలోని ప్రతి పౌరుడిపై అప్పుల భారం పెరుగుతోంది. ఇది మేం చెప్పడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వ స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది. దీంతో రుణాల సంఖ్య రూ.159 లక్షల కోట్లు దాటింది. అప్పులు పెరిగే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ సంఖ్య అతి త్వరలో రూ.160 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది. దీని వల్ల ఇప్పుడు ప్రభుత్వ అప్పు రూ.159.53 లక్షల కోట్లకు పెరిగింది. ప్రస్తుత దేశ జనాభా 1 బిలియన్ 40 కోట్లు.. ఈ లెక్కన చూసుకుంటే దేశంలోని ప్రతి పౌరుడిపై ప్రస్తుతం రూ.1,13,571 కంటే ఎక్కువ అప్పు ఉంది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెరుగుదల
ఈ అప్పుల పెరుగుదల గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నివేదిక ద్వారా సమర్పించింది. నివేదిక ప్రకారం.. మార్చి చివరి వారంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం స్థూల రుణం రూ.156.08 లక్షల కోట్లు. కానీ 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నాటికి ఇది 2.2 శాతం పెరిగింది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ప్రభుత్వ మొత్తం స్థూల బాధ్యతలు 2.2 శాతం పెరిగాయి.
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
Read Also:Nadendla Manohar: వారాహి విజయ యాత్రతో ప్రజలకు బలమైన సందేశం ఇవ్వనున్న పవన్
సర్దుబాటు తర్వాత రూ.2.71 లక్షల కోట్లు
ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ విభాగానికి చెందిన పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ సెల్ ఏప్రిల్-జూన్ 2010-11 నుండి రుణ నిర్వహణపై త్రైమాసిక నివేదికను క్రమం తప్పకుండా జారీ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం డేటెడ్ సెక్యూరిటీల ఇష్యూ/డిస్పోజల్ ద్వారా రూ.4.08 లక్షల కోట్ల స్థూల మొత్తాన్ని సేకరించింది. సర్దుబాటు తర్వాత రూ.2.71 లక్షల కోట్లకు చేరింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వ్యాట్ సగటు రాబడి 7.13 శాతంగా నమోదైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ సంఖ్య 7.34 శాతంగా ఉంది. ఇష్యూ వ్యాట్ సగటు మెచ్యూరిటీ జూన్ త్రైమాసికంలో 17.58 సంవత్సరాలుగా నమోదు చేయబడింది. ఇది మార్చి త్రైమాసికంలో 16.58 సంవత్సరాలు. ఈ త్రైమాసికంలో సెకండరీ మార్కెట్లో లావాదేవీల డీల్ 7 నుండి 10 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధికి సంబంధించిన సమస్యలపై దృష్టి సారించింది.
Read Also:Ram Charan RC 16: రెహమాన్ పాట… చరణ్ ఆట… అప్పుడే షురూ అయ్యింది
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!