Cognizant: ఉద్యోగులపై నిఘా పెట్టిన కాగ్నిజెంట్.. 5 నిమిషాల మౌస్ కదిలించకపోతే..
- ఉద్యోగులపై నిఘా పెట్టిన కాగ్నిజెంట్..
- ల్యాప్ట్యాప్లు, డెస్క్టాప్ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్..
- మౌస్ను 5 నిమిషాలలోపు కదిలించకపోతే ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cognizant: ఐటీ రంగంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారనేదానిపై ప్రతిరోజు నిఘా ఉంటుంది. ఒక ఉద్యోగి ఎంత సేపు వర్క్ చేస్తున్నాడు?, ఎంతసేపు ఖాళీగా ఉంటున్నాడు అనే దానిపై కంపెనీలు చూస్తుంటాయి. అయితే, ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కూడా ఇదే తరహాలో ఎంప్లాయిస్ కార్యకలాపాలపై నజర్ పెట్టింది. దీని కోసం కొత్త మానిటరింగ్ వ్యవస్థను తెచ్చింది. కంపెనీ జారీ చేసే ల్యాప్ట్యాప్లు, డెస్క్టాప్ల ద్వారా ఉద్యోగుల పని తీరును ట్రాక్ చేయనుంది. వారు ఉపయోగించే కీబోర్డు, మౌస్లను ట్రాకింగ్ కోసం వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో ట్రాకింగ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Also Read
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
- JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
- Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
అయితే, ఉద్యోగుల ల్యాప్ట్యాప్/ డెస్క్టాప్లో ఈ ట్రాకింగ్ కోసం ప్రోహ్యాన్స్ లాంటి టూల్స్ను కాగ్నిజెంట్ సంస్థ వాడుతుంది. ఎంప్లా్య్ ఖాళీగా ఉండే టైంని ఈ టూల్ ద్వారా ట్రాక్ చేస్తారు. మౌస్ లేదా కీబోర్డును ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్-యాక్టివ్గా ఉంచితే సదరు ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే, మౌస్ లేదా కీబోర్డు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కదిలించకపోతే వేరే పనిలో ఉన్నట్లు గుర్తిస్తుంది. ఈ మానిటిరింగ్ వ్యవస్థ ఒక్కో టీమ్కు ఒక్కోలా ఉంటుందని సమాచారం.
Read Also: Vijay Cinema House : కోర్ట్ మూవీ హీరోయిన్ కొత్త సినిమా స్టార్ట్
ఇక, ఈ ట్రాకింగ్ను ఎంప్లాయ్ పని తీరుతో ముడిపెట్టబోమని కంపెనీ వెల్లడించింది. ప్రమోషన్లు, బోనస్ లాంటి వాటి అంశాల్లో ఈ డేటాను ఉపయోగించమని ఆ సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు చెప్పారు. అన్ని సంస్థల మాదిరిగానే ఈ టూల్స్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. విప్రో లాంటి కంపెనీలు సైతం ప్రోహ్యాన్స్ టూల్స్ను ఉపయోగిస్తున్నాయి. దీన్ని ఉపయోగించేందుకు ఉద్యోగి నుంచి పర్మిషన్ తీసుకుంటున్నామని కంపెనీ తెలియజేస్తున్నాయి. ఎంప్లాయిస్ మాత్రం తప్పనిసరి రూల్ అని చెబుతున్నారు. ఒక్కో టాస్క్పై ఎంత సేపు వర్క్ చేస్తున్నారు?.. ఏ అప్లికేషన్ను ఎంతసేపు ఉపయోగిస్తున్నారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. ఏఐ రాకతో ఉద్యోగుల్లో ఇప్పటికే అభద్రతాభావం కొనసాగుతుండగా.. ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ వల్ల ఉద్యోగుల పనిపై నిఘా పెట్టడమంటే వారిని మరింత ఒత్తిడిలోకి నెట్టడమేనని వాపోతున్నారు.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..