Cinema Halls: ఈ నెల ఇంట్లోనే. సినిమా హాళ్లకు వెళ్లేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్లో రిలీజ్కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వేని దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో నిర్వహించింది. ఇందులో భాగంగా 11,707 మంది అభిప్రాయాలను సేకరించింది. దీన్నిబట్టి ప్రతి ఐదుగురిలో ఒకరికి (22 శాతం మందికి) వచ్చే రెండు నెలల పాటు అసలు సినిమాకి వెళ్లే ప్లానే లేదని తేలింది. మార్చిలో 41 శాతం మంది మాత్రమే ఈ ఒపీనియన్ని వెల్లడించగా ఈ పర్సంటేజ్ లేటెస్టుగా సగానికి పడిపోవటం గమనార్హం.
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
అదానీ భారీ పెట్టుబడి
గౌతమ్ అదానీ గ్రూపు ఒడిశాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.416.53 బిలియన్లతో అల్యూమినియం రిఫైనరీని నిర్మించనున్నారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకీ అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్లో వెల్లడించారు. రిఫైనరీ వార్షిక సామర్థ్యం 4 మిలియన్ టన్నులు అని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై స్పందించేందుకు ‘అదానీ’ ప్రతినిధి నిరాకరించటం గమనార్హం.
Online Games: ఆన్లైన్లో ఆడినంత ఆట. 5జీ ఎంట్రీతో ఆకాశమే హద్దు.
పెరిగిన యూజర్లు
డిస్నీ+హాట్స్టార్కి కొత్త యూజర్ల సంఖ్య పెరిగింది. ఏడాది కాలంలో 83 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 5.84 కోట్లకు చేరింది. ఇది జులై 2 వరకు ఉన్న సమాచారం. ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియాకు సంబంధించిన డేటా. గతేడాది ఇదే సమయానికి పెయిడ్ యూజర్ల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరికి సబ్స్క్రైబర్ల సంఖ్యను 8 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లలో ఇవాళ ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 59384.62 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 137.80 పాయింట్లు పెరిగి 17672.55 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.45 వద్ద ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు నెలల్లో 26 శాతం లాభపడ్డాయి. టెక్ మహింద్ర, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటాన్లకూ లాభాలు వచ్చాయి.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!