Cinema Halls: ఈ నెల ఇంట్లోనే. సినిమా హాళ్లకు వెళ్లేది లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్లో రిలీజ్కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం ఇండస్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ సర్వేని దేశవ్యాప్తంగా 302 జిల్లాల్లో నిర్వహించింది. ఇందులో భాగంగా 11,707 మంది అభిప్రాయాలను సేకరించింది. దీన్నిబట్టి ప్రతి ఐదుగురిలో ఒకరికి (22 శాతం మందికి) వచ్చే రెండు నెలల పాటు అసలు సినిమాకి వెళ్లే ప్లానే లేదని తేలింది. మార్చిలో 41 శాతం మంది మాత్రమే ఈ ఒపీనియన్ని వెల్లడించగా ఈ పర్సంటేజ్ లేటెస్టుగా సగానికి పడిపోవటం గమనార్హం.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
అదానీ భారీ పెట్టుబడి
గౌతమ్ అదానీ గ్రూపు ఒడిశాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.416.53 బిలియన్లతో అల్యూమినియం రిఫైనరీని నిర్మించనున్నారు. క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకీ అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం నవీన్ పట్నాయక్ ట్విట్టర్లో వెల్లడించారు. రిఫైనరీ వార్షిక సామర్థ్యం 4 మిలియన్ టన్నులు అని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై స్పందించేందుకు ‘అదానీ’ ప్రతినిధి నిరాకరించటం గమనార్హం.
Online Games: ఆన్లైన్లో ఆడినంత ఆట. 5జీ ఎంట్రీతో ఆకాశమే హద్దు.
పెరిగిన యూజర్లు
డిస్నీ+హాట్స్టార్కి కొత్త యూజర్ల సంఖ్య పెరిగింది. ఏడాది కాలంలో 83 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 5.84 కోట్లకు చేరింది. ఇది జులై 2 వరకు ఉన్న సమాచారం. ఇండియా, సౌత్ ఈస్ట్ ఆసియాకు సంబంధించిన డేటా. గతేడాది ఇదే సమయానికి పెయిడ్ యూజర్ల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరికి సబ్స్క్రైబర్ల సంఖ్యను 8 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లలో ఇవాళ ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 59384.62 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 137.80 పాయింట్లు పెరిగి 17672.55 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.45 వద్ద ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు నెలల్లో 26 శాతం లాభపడ్డాయి. టెక్ మహింద్ర, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటాన్లకూ లాభాలు వచ్చాయి.
తాజావార్తలు
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Jananayagan Bookings : నిరాశపరిచిన జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్స్.. కూలీని టచ్ చేయడం కూడా కష్టమే
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
-
DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
ట్రెండింగ్
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!