Government Loan Schemes: మీకు తెలుసా? ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్!
- బిజినెస్ కు డబ్బు కావాలా
- ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది.
రుణాలు అందించే పథకాల్లో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణం పొందొచ్చు. తక్కువ వడ్డీ, సబ్సీడీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం డబ్బులతో వ్యాపార విస్తరణ, కొత్త పరికరాలు/యంత్రాలు/సామగ్రి కొనుగోళ్లు వంటివి చేయొచ్చు.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్:
ఈ పథకాన్ని MSME మంత్రిత్వ శాఖ 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. 75 శాతం వరకు గ్యారెంటీ కవర్ లభిస్తుంది. మైక్రో, స్మాల్ ఎంటర్ ప్రైజెస్ సెక్టార్కి ఎలాంటి గ్యారంటీ లేకుండానే కేంద్రం రుణాలు ఇస్తోంది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY):
వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తారు. వ్యవసాయేతర రంగంలో వ్యాపారం చేసే వారికి, రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఈ పథకం కింద, బ్యాంకులు, NBFCలు, MFIలు వంటి సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఇందులో మూడు రకాల లోన్స్ శిశు, కిషోర్, తరుణ్ ఉంటాయి.
శిశు: రూ. 50,000 వరకు రుణాలు
కిషోర్: రూ. 50,000 నుంచి రూ. 5,00,000 వరకు రుణాలు
తరుణ్: రూ. 5,00,000 నుంచి, రూ. 10,00,000 వరకు రుణాలు అందిస్తారు.
స్టాండప్ ఇండియా స్కీమ్:
షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), షెడ్యూల్డ్ ట్రైబ్ (ST), మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణాలను బ్యాంకులు అందిస్తాయి. ఈ లోన్స్ ను తయారీ, సేవలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వంటి రంగాలకు అందిస్తారు.
తాజావార్తలు
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!