Government Loan Schemes: మీకు తెలుసా? ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్!
- బిజినెస్ కు డబ్బు కావాలా
- ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది.
రుణాలు అందించే పథకాల్లో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణం పొందొచ్చు. తక్కువ వడ్డీ, సబ్సీడీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం డబ్బులతో వ్యాపార విస్తరణ, కొత్త పరికరాలు/యంత్రాలు/సామగ్రి కొనుగోళ్లు వంటివి చేయొచ్చు.
Also Read
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్:
ఈ పథకాన్ని MSME మంత్రిత్వ శాఖ 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. 75 శాతం వరకు గ్యారెంటీ కవర్ లభిస్తుంది. మైక్రో, స్మాల్ ఎంటర్ ప్రైజెస్ సెక్టార్కి ఎలాంటి గ్యారంటీ లేకుండానే కేంద్రం రుణాలు ఇస్తోంది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY):
వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తారు. వ్యవసాయేతర రంగంలో వ్యాపారం చేసే వారికి, రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఈ పథకం కింద, బ్యాంకులు, NBFCలు, MFIలు వంటి సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఇందులో మూడు రకాల లోన్స్ శిశు, కిషోర్, తరుణ్ ఉంటాయి.
శిశు: రూ. 50,000 వరకు రుణాలు
కిషోర్: రూ. 50,000 నుంచి రూ. 5,00,000 వరకు రుణాలు
తరుణ్: రూ. 5,00,000 నుంచి, రూ. 10,00,000 వరకు రుణాలు అందిస్తారు.
స్టాండప్ ఇండియా స్కీమ్:
షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), షెడ్యూల్డ్ ట్రైబ్ (ST), మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణాలను బ్యాంకులు అందిస్తాయి. ఈ లోన్స్ ను తయారీ, సేవలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వంటి రంగాలకు అందిస్తారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?