Government Loan Schemes: మీకు తెలుసా? ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్!
- బిజినెస్ కు డబ్బు కావాలా
- ఈ ప్రభుత్వ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ.1 కోటి పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారం రిస్కుతో కూడుకున్నదే అయినప్పటికీ సంపద సృష్టించడానికి ఇదే సరైన మార్గం అంటుంటారు నిపుణులు. ఏ చిన్న బిజినెస్ పెట్టుకున్నా సరే స్వయం ఉపాధి పొందడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు పది మందికి ఉపాధి కల్పించొచ్చు. అయితే బిజినెస్ చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పెట్టుబడి. డబ్బు లేకనే చాలా మంది ఆలోచన వద్దే ఆగిపోతుంటారు. మరి ఇలాంటి వారు బిజినెస్ చేసి లైఫ్ లో ఎదగడానికి ప్రభుత్వం లోన్ అందించేందుకు అద్భుతమైన స్కీమ్ లను ప్రవేశ పెట్టింది.
రుణాలు అందించే పథకాల్లో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ప్రధాన మంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీముల ద్వారా రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణం పొందొచ్చు. తక్కువ వడ్డీ, సబ్సీడీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం డబ్బులతో వ్యాపార విస్తరణ, కొత్త పరికరాలు/యంత్రాలు/సామగ్రి కొనుగోళ్లు వంటివి చేయొచ్చు.
Also Read
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్:
ఈ పథకాన్ని MSME మంత్రిత్వ శాఖ 2000 సంవత్సరంలో ప్రారంభించింది. ఇందులో రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. 75 శాతం వరకు గ్యారెంటీ కవర్ లభిస్తుంది. మైక్రో, స్మాల్ ఎంటర్ ప్రైజెస్ సెక్టార్కి ఎలాంటి గ్యారంటీ లేకుండానే కేంద్రం రుణాలు ఇస్తోంది.
ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY):
వ్యాపారం చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద, సూక్ష్మ, చిన్న వ్యాపారాలకు రుణాలు ఇస్తారు. వ్యవసాయేతర రంగంలో వ్యాపారం చేసే వారికి, రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఈ పథకం కింద, బ్యాంకులు, NBFCలు, MFIలు వంటి సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఇందులో మూడు రకాల లోన్స్ శిశు, కిషోర్, తరుణ్ ఉంటాయి.
శిశు: రూ. 50,000 వరకు రుణాలు
కిషోర్: రూ. 50,000 నుంచి రూ. 5,00,000 వరకు రుణాలు
తరుణ్: రూ. 5,00,000 నుంచి, రూ. 10,00,000 వరకు రుణాలు అందిస్తారు.
స్టాండప్ ఇండియా స్కీమ్:
షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC), షెడ్యూల్డ్ ట్రైబ్ (ST), మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా, 10 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణాలను బ్యాంకులు అందిస్తాయి. ఈ లోన్స్ ను తయారీ, సేవలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు వంటి రంగాలకు అందిస్తారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!