Loan on Aadhaar Card: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్!
- ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్!
- బ్యాంకుల వెబ్ సైట్స్, యాప్ ల ద్వారా పర్సనల్ లోన్స్ కు అప్లై చేసుకోవచ్చు
- రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఆధార్తో వ్యక్తిగత రుణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడుతుంటాయి. సమయానికి చేతిలో నగదు ఉండదు. అలాంటి సమయంలో ఫ్రెండ్స్, తెలిసిన వారి వద్ద డబ్బులు అడుగుతుంటారు. అప్పులు చేయడానికి కూడా సిద్ధపడుతుంటారు. కానీ కావాల్సిన టైమ్ కు డబ్బు చేతికి అందదు. అప్పుడే ఈజీగా డబ్బు చేతికందే మార్గం ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు, మరి మీకు కూడా అర్జెంటుగా డబ్బులు అవసరం పడ్డాయా? సులభంగా రూ. 5 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంది. జస్ట్ మీ వద్ద ఆధార్ కార్డు ఉంటే చాలు. ఏంటి ఆధార్ తో లోన్ కూడా ఇస్తున్నారా? అని ఆలోచిస్తున్నారా? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు పర్సనల్ లోన్స్ ను అందిస్తున్నాయి.
గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రుణాన్ని ఇస్తున్నాయి. ఎందుకంటే ఆధార్ లో మీ వ్యక్తిగత వివరాలు అన్నీ ఉంటాయి. ఇతర డాక్యుమెంట్స్ తో పనిలేకుండా ఆధార్ పై లోన్స్ మంజూరు చేస్తున్నాయి. ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకుని లోన్ పొందొచ్చు. బ్యాంకుల వెబ్ సైట్స్, యాప్ ల ద్వారా పర్సనల్ లోన్స్ కు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 58 ఏళ్ల వయసున్న వారికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు లోన్స్ ఇస్తాయి. ఉద్యోగులకు, స్థిర ఆదాయం పొందుతున్న వారికి బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి. రూ. 50 వేల నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఆధార్తో వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. ఎన్ఎఫ్ బీలు రూ. 25 వేల నుంచి కూడా లోన్స్ మంజూరు చేస్తున్నాయి. లోన్ చెల్లించేందుకు మీకు ఐదేళ్ల వరకు అనుకూలమైన టెన్యూర్ ను ఎంచుకోవచ్చు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
పర్సనల్ లోన్ కావాలనుకునే వారు ఆధార్ ద్వారా లోన్స్ అందిస్తున్న బ్యాంకులు, లేదా ఎన్ బీఎఫ్ సీ వెబ్ సైట్ లను సందర్శించాలి. అక్కడ లోన్ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి. అర్హత ఉన్నట్లైతే అవసరమైనపత్రాలను అప్ లోడ్ చేయాలి. దీని తర్వాత ఆధార్ ఓటీపీతో కేవైసీ పూర్తి చేయాలి. అన్ని పత్రాలను అప్ లోడ్ చేసి సబ్మిట్ చేశాక రెండు రోజుల వ్యవధిలో లోన్ మంజూరు అవుతుంది. అకౌంట్ లోనే నగదు జమ అవుతుంది. అయితే ఆన్ లైన్ లో లోన్స్ తీసుకునేటపుడు పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. డిజిటల్ ఫ్రాడ్ ఎక్కువగా జరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..