Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..
- ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ..
- 60 శాతానికి పెరిగిన కరువు భత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర కేబినెట్ భారీ ఊరటనిచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. కేవలం జీతం పెరగడమే కాకుండా.. పాత బకాయిలు (అరియర్స్) కూడా ఒకేసారి చేతికి అందనుండటంతో లక్షలాది కుటుంబాల్లో సంతోషం నెలకొంది. ఈ పెంపు వల్ల పెరిగిన నిత్యావసర ధరల భారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
డీఏ పెంపు వివరాలు..
కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రస్తుతమున్న 58 శాతం నుంచి 60 శాతానికి పెంచింది. అంటే నేరుగా 2 శాతం పెంపును ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జనవరి 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు (జనవరి మరియు జూలై) ఏఐసీపీఐ (AICPI) గణాంకాల ఆధారంగా ఈ డీఏను సవరిస్తుంది.
Also Read
- Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
- PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
- Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్గా మొబైల్లో తెలుసుకోండిలా..
- Currency Notes: పాత రూ.1, రూ.2, రూ.10 నోట్లకు భలే డిమాండ్.. కొనాలన్నా, అమ్మాలన్నా ఇదే ఛాన్స్..
పెరిగిన 2 శాతం డీఏ వల్ల మీ జీతంలో వచ్చే మార్పును ఈ ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు. బేసిక్ శాలరీ రూ. 20,000 ఉంటే పాత డీఏ (58%)కు రూ. 11,600, కొత్త డీఏ (60%)కు రూ. 12,000 పెరుగుతాయి. అంటే నెలవారీ పెరుగుదల రూ. 400 వరకు ఉంటుంది. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 400×3=1,200 రూపాయలు అదనంగా అందుతాయి.
Also Read:PBSK Owner Preity Zinta: ప్రీతి జింటా స్టేడియంలో ఎందుకు కనిపించడం లేదో తెలుసా..? కారణం ఇదే..
ఒక వేళ బేసిక్ శాలరీ రూ. 50,000 ఉంటే పాత డీఏ (58%).. రూ. 29,000, కొత్త డీఏ (60%) ప్రకారం రూ. 30,000.. అంటే నెలవారీ పెరుగుదల రూ. 1,000. అరియర్స్ (3 నెలలకు – జనవరి నుండి మార్చి): 1,000×3=3,000 రూపాయలు ఏప్రిల్ నెల జీతంతో కలిపి వస్తాయి.
సాధారణంగా ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించినప్పుడు, అది గడిచిన నెలల నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయం ప్రకారం.. జనవరి నుంచి మార్చి వరకు ఉన్న మూడు నెలల పెరిగిన డీఏ బకాయిలను (Arrears), ఏప్రిల్ నెల జీతంతో కలిపి చెల్లించే అవకాశం ఉంది. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో భారీగా నగదు జమ కానుంది. ఈ పెంపు జీతానికే పరిమితం కాకుండా.. పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ రిలీఫ్ (DR) కు కూడా వర్తిస్తుంది. దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆర్థికంగా అండ లభించనుంది.
తాజావార్తలు
-
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు
-
Murali Mohan: అంధ విద్యార్థుల మధ్య 61వ వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న మురళీమోహన్
-
Ration Card: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఇంటికి రేషన్ కార్డు జారీ.. MRO ఏమన్నారంటే..
-
Trump-Meloni: ట్రంప్-మెలోని మధ్య ముదిరిన ‘‘ఫోటో’’ వివాదం..
-
Narahari Rao : బ్యాంక్ లాకర్ తెరిస్తే షాక్.. నరహరి దాచిన నోట్ల కట్టలు, కిలోల బంగారం.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!