Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. రైళ్లలో అనధికారిక, టికెట్ లేని ప్రయాణాలను అరికట్టడానికి, రైల్వే కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడానికి జరిమానా మొత్తాన్ని భారీగా పెంచింది. ‘జన్ విశ్వాస్ చట్టం, 2026’ నిబంధనల ప్రకారం.. రైల్వే చట్టం 1989 లోని సెక్షన్ 137, 138 కింద విధించే కనీస జరిమానాను రూ. 250 నుంచి రూ. 500 లకు పెంచుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కొత్త నిబంధన 2026 జూన్ 20 నుంచి అమలుల్లోకి వచ్చింది.
టికెట్ లేని ప్రయాణం: చట్టం ఏం చెబుతోంది?
రైల్వే అడ్మినిస్ట్రేషన్ను మోసం చేసే ఉద్దేశ్యంతో సరైన పాస్ లేదా టికెట్ లేకుండా రైలు పెట్టెలోకి ప్రవేశించడం లేదా ప్రయాణించడం, గత ప్రయాణంలో ఇప్పటికే ఉపయోగించిన సింగిల్ టికెట్/పాస్ను మళ్లీ ఉపయోగించడం, లేదా రిటర్న్ టికెట్లోని సగాన్ని రెండోసారి వాడటానికి ప్రయత్నించడం వంటి పనులు చేస్తే అవి నేరంగా పరిగణించబడుతుంది.
Also Read
- Debt Trap: అప్పు తీర్చడానికి మరో అప్పు.. EMI ట్రాప్లో మిడిల్క్లాస్ ఎలా చిక్కుకుంటోంది?
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
- Flipkart Food Delivery: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్కార్ట్ గ్రాండ్ ఎంట్రీ.. స్విగ్గీ, జొమాటోకు కొత్త సవాల్!
- Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
చెల్లించాల్సిన జరిమానా ఎంత?
పట్టుబడిన ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి సంబంధించిన అసలు టికెట్ ధరతో పాటు సమానమైన అదనపు ఛార్జీని (Excess Charges) చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు ఛార్జీ కనీసం రూ. 500 గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు ఎక్కడ ఎక్కాడనేది స్పష్టంగా తెలియకపోతే, ఆ రైలు ప్రారంభమైన స్టేషన్ నుండి లేదా చివరిసారిగా టికెట్లు తనిఖీ చేసిన స్టేషన్ నుండి టికెట్ ధరను లెక్కిస్తారు.
జరిమానా కట్టకపోతే జైలు శిక్ష..
రైల్వే అధికారులు డిమాండ్ చేసినప్పుడు జరిమానా, టికెట్ ధరను చెల్లించడానికి నిరాకరిస్తే లేదా విఫలమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయి. రైల్వే సిబ్బంది సదరు వ్యక్తిపై కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలను వసూలు చేయడంతో పాటు.. జరిమానా చెల్లించనందుకు గాను గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ. 500 వరకు అదనపు జరిమానా.. లేదా ఈ రెండింటినీ విధించే అధికారం కోర్టుకు ఉంటుంది. సెంట్రల్ రైల్వే జోన్ కేవలం మే నెలలోనే 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికుల నుండి రూ. 40.85 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో, ప్రయాణికులు ఎల్లప్పుడూ సరైన టికెట్ కొనుగోలు చేసి, గౌరవప్రదంగా ప్రయాణించాలని రైల్వే శాఖ కోరింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!