PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు శనివారం భారీ ఉపశమనాన్ని కలిగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధులను ఆయన అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన ‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల నుంచి ప్రధానమంత్రి బటన్ నొక్కి, దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000లను అందిస్తోంది.
రాష్ట్రాల్లో వేడుకలు..
ఈ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ) లేని రైతులకు కూడా ఈ విడతలో ఊరట లభించింది. యూపీలోని 2.17 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,352 కోట్లు జమ కానున్నాయి. అయితే, ఐడీలు లేకపోవడం వల్ల యూపీలో దాదాపు 50 లక్షల మందికి, బీహార్లో 34 వేల మందికి పైగా రైతుల పేర్లు జాబితా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. బీహార్లో గత విడతలో 73.34 లక్షల మంది ప్రయోజనం పొందారు.
Also Read
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
- EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి?
ఖాతాల్లో జమ అయిన రూ. 2,000 నగదును రైతులు సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. డిజీపే (DigiPay) లేదా డిజీపే లైట్ (DigiPayLite) ద్వారా, లేదా తమకు దగ్గరలోని ఎఫ్పీఓ (FPO), పీఏసీఎస్ (PACS) కేంద్రాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
రైతులు తమ ఖాతాలోకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ‘pmkisan.gov.in’ పోర్టల్లోకి వెళ్లి ‘Know Your Status’ పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..