PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు శనివారం భారీ ఉపశమనాన్ని కలిగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధులను ఆయన అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన ‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల నుంచి ప్రధానమంత్రి బటన్ నొక్కి, దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000లను అందిస్తోంది.
రాష్ట్రాల్లో వేడుకలు..
ఈ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ) లేని రైతులకు కూడా ఈ విడతలో ఊరట లభించింది. యూపీలోని 2.17 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,352 కోట్లు జమ కానున్నాయి. అయితే, ఐడీలు లేకపోవడం వల్ల యూపీలో దాదాపు 50 లక్షల మందికి, బీహార్లో 34 వేల మందికి పైగా రైతుల పేర్లు జాబితా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. బీహార్లో గత విడతలో 73.34 లక్షల మంది ప్రయోజనం పొందారు.
Also Read
- Gas Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? ఎప్పుడు వస్తుందో సింపుల్గా మొబైల్లో తెలుసుకోండిలా..
- Currency Notes: పాత రూ.1, రూ.2, రూ.10 నోట్లకు భలే డిమాండ్.. కొనాలన్నా, అమ్మాలన్నా ఇదే ఛాన్స్..
- SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
- Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి?
ఖాతాల్లో జమ అయిన రూ. 2,000 నగదును రైతులు సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. డిజీపే (DigiPay) లేదా డిజీపే లైట్ (DigiPayLite) ద్వారా, లేదా తమకు దగ్గరలోని ఎఫ్పీఓ (FPO), పీఏసీఎస్ (PACS) కేంద్రాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
రైతులు తమ ఖాతాలోకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ‘pmkisan.gov.in’ పోర్టల్లోకి వెళ్లి ‘Know Your Status’ పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
తాజావార్తలు
-
PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
-
Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
-
Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!