PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులకు శనివారం భారీ ఉపశమనాన్ని కలిగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 23వ విడత నిధులను ఆయన అధికారికంగా విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ వేదికగా జరిగిన ‘పశ్చిమ బంగ దివస్’ వేడుకల నుంచి ప్రధానమంత్రి బటన్ నొక్కి, దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000లను అందిస్తోంది.
రాష్ట్రాల్లో వేడుకలు..
ఈ కార్యక్రమం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ‘పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్’ నిర్వహించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో రైతు గుర్తింపు కార్డు (ఫార్మర్ ఐడీ) లేని రైతులకు కూడా ఈ విడతలో ఊరట లభించింది. యూపీలోని 2.17 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,352 కోట్లు జమ కానున్నాయి. అయితే, ఐడీలు లేకపోవడం వల్ల యూపీలో దాదాపు 50 లక్షల మందికి, బీహార్లో 34 వేల మందికి పైగా రైతుల పేర్లు జాబితా నుండి తొలగించినట్లు తెలుస్తోంది. బీహార్లో గత విడతలో 73.34 లక్షల మంది ప్రయోజనం పొందారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Bank Strike Alert: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! సెప్టెంబర్ 11న బ్యాంకులు బంద్..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి?
ఖాతాల్లో జమ అయిన రూ. 2,000 నగదును రైతులు సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. డిజీపే (DigiPay) లేదా డిజీపే లైట్ (DigiPayLite) ద్వారా, లేదా తమకు దగ్గరలోని ఎఫ్పీఓ (FPO), పీఏసీఎస్ (PACS) కేంద్రాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
స్టేటస్ చెక్ చేసుకునే విధానం..
రైతులు తమ ఖాతాలోకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి ‘pmkisan.gov.in’ పోర్టల్లోకి వెళ్లి ‘Know Your Status’ పై క్లిక్ చేయాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే పూర్తి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!