Business Today: Today Business Headlines 20-10-22
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Today: సాగర్ సిమెంట్స్ ఆదాయం పెరిగింది. కానీ..: సాగర్ సిమెంట్స్ ఆదాయం గతేడాది 2వ త్రైమాసికంతో పోల్చితే ఈసారి 32 శాతం పెరిగింది. పోయినేడాది 371 కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ రాగా ఇప్పుడది 489 కోట్ల రూపాయలకు పెరిగింది. నిరుడు 20 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించిన సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం అంతకు రెట్టింపు కన్నా ఎక్కువ.. అంటే 49 కోట్ల రూపాయల నికర నష్టాన్ని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన క్వార్టర్లో నిర్వహణ ఖర్చులు ఏకంగా 52 శాతం పెరగటం వల్లే నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చినట్లు వెల్లడించింది.
‘గంగవరం’ ప్రమోటర్లకు ‘అదానీ’ షేర్లు
Also Read
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
గంగవరం పోర్ట్ లిమిటెడ్లోని అర్హులైన ప్రమోటర్లకు 4 కోట్ల 77 లక్షలకు పైగా షేర్లను కేటాయించాలని అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ నిర్ణయించింది. ఒక్కొక్కటి 2 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన వాటాలను ఇవ్వటానికి అదానీ పోర్ట్స్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో అదానీ పోర్ట్స్ ఈక్విటీ షేర్ల సంఖ్య 216 కోట్లను దాటుతోంది. షేర్ స్వాప్ ఒప్పందం ప్రకారం గంగవరం పోర్ట్స్లో 58 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకున్న అదానీ పోర్ట్స్ ఈ మేరకు స్టాక్స్ను కేటాయిస్తోంది.
ఇండోనేసియా స్టార్టప్లో ‘విప్రో’ పెట్టుబడి
విప్రో కన్జ్యూమర్ కేర్-వెంచర్స్ సంస్థ ఇండోనేసియా స్టార్టప్ ‘యువిట్’లో పెట్టుబడులు పెట్టనుంది. ఈ స్టార్టప్.. పిల్లలతోపాటు పెద్దలకు కావాల్సిన న్యూట్రాస్యుటికల్ మరియు వెల్నెస్ ప్రొడక్టులను గమ్మీస్ ఫార్మాట్లో రూపొందిస్తోంది. ఇక మీదట వినియోగదారులకు రోజువారీ జీవనశైలికి అవసరమైన ప్రీమియం క్వాలిటీతో కూడిన సరసమైన ధరల్లో లభించే ఉత్పత్తుల తయారీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. ఇదిలాఉండగా.. తాము ఒక సౌత్ ఈస్ట్ ఏసియా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇదే మొదటిసారని విప్రో కన్జ్యూమర్ కేర్ వెంచర్స్ ఎండీ తెలిపారు.
‘ఆకాశ’ దేశాన.. సెప్టెంబర్ మాసాన..
మన దేశీయ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించి పూర్తి స్థాయిలో సర్వీసులను ప్రారంభించిన మొదటి నెలలోనే ఆకాశ ఎయిర్ దాదాపు ఒక శాతం వాటాను సొంతం చేసుకుంది. సెప్టెంబర్లో వివిధ ఎయిర్లైన్స్ కనబరిచిన పనితీరును డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. సుమారు 12 ఎయిర్లైన్స్ గల ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో దగ్గరదగ్గరగా 58 శాతం వాటాతో ఇండిగో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే.. రాకేష్ ఝున్ఝున్వాలా భౌతికంగా దూరమైనా ఆకాశ ఎయిర్ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉందని, ఐదేళ్లలో 72 ఎయిర్క్రాఫ్ట్లతో విస్తరించనుందని సీఈఓ వినయ్ దూబే చెప్పారు.
5 ఏళ్లలో.. 3 రెట్లు..
మన దేశంలో గడచిన ఐదేళ్లలో బయోఫ్యూయెల్స్ విక్రయించే పెట్రోల్ పంప్ల సంఖ్య 3 రెట్లు పెరిగిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. 2016-17లో 29 వేల 897 బయోఫ్యూయెల్ పెట్రోల్ పంపులు మాత్రమే ఉండగా ఈ సంఖ్య 2021-22లో 67 వేల 641కి చేరినట్లు చెప్పారు. ఇథనాల్ గిరాకీ 2025 నాటికి 10 బిలియన్ లీటర్లు దాటుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్ నాటికి ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని వెయ్యి కోట్ల లీటర్లుగా నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.
‘ఆతిథ్య రంగానికి అతిపెద్ద విజయం’
ఓయో, మేక్మైట్రిప్, గోఇబిబోలకు జరిమానా విధించటం ఆతిథ్య రంగానికి అతిపెద్ద విజయమని, వాటి ఆధిపత్య ధోరణికి చెంపపెట్టని ‘‘ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా’’ అభిప్రాయపడింది. మూడేళ్ల కిందట తాము ఇచ్చిన ఫిర్యాదులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. సరైన వ్యాపార విలువలను పాటించనందున CCI నిన్న బుధవారం మేక్మైట్రిప్, గోఇబిబోలకు కలిపి 223 కోట్లు, ఓయోకి 168 కోట్లు పెనాల్టీ వేసిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ అప్డేట్
ఇండియన్ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు కోల్పోయి 58835 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 77 పాయింట్లు తగ్గి 17434 వద్ద కొనసాగుతోంది. ఇండస్ఇండ్, షాపర్స్ స్టాప్, ఐటీసీ, ఎన్ఎల్సీ స్టాక్స్ ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.25 వద్ద ఉంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!