PM Mudra Yojana: పైసా గ్యారెంటీ లేకుండా రూ.20 లక్షల రుణం.. అవకాశం మిస్ అవ్వకండి!
PM Mudra Yojana: ఈ రోజుల్లో పైసా గ్యారెంటీ లేకుండా సొంత వాళ్లే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్న విషయం మీకు తెలుసా.. ఇది నిజంగా నిజమైన వార్త. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఇంతకీ ఈ రుణం ఇచ్చేది ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: NABARD Recruitment 2026: నాబార్డ్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్.. గ్రాడ్యుయేట్స్ కి మంచి ఛాన్స్
Also Read
- Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
- Mark Zuckerberg: ఫేస్బుక్ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్బర్గ్కు డిగ్రీ లేదు తెలుసా!
- Cigarette Price Hike: సిగరెట్ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
- Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
కేంద్ర ప్రభుత్వం యువతకు, వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తోంది. ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఈ రుణానికి ఎటువంటి హామీ అవసరం లేదు. ఇది పూర్తిగా పూచీకత్తు లేని రుణం. నిజానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ పథకం గతంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రుణాలను అందించింది. కానీ ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. FY2024-25 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఇంతకీ ఈ ప్రభుత్వ పథకం పేరు ఏంటో తెలుసా.. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఈ ప్రభుత్వ పథకం నాలుగు కేటగిరిల్లో వ్యాపారాలకు రుణాలు అందిస్తుంది. తద్వారా వారు కాలక్రమేణా తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. శిశు కేటగిరీ కింద రూ.50,000 రుణం, కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణం అందజేస్తారు.
ప్రధానమంత్రి ముద్ర యోజనను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కోసం రూపొందించినది. 8వ తరగతి ఉత్తీర్ణులైనా, ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఎటువంటి విద్యా అర్హతలు అవసరం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, వ్యాపార ప్రణాళిక, KYC పత్రం, ఆదాయ రుజువు కలిగి ఉండటం అవసరం. దరఖాస్తు చేసుకోడానికి ఆసక్తి గల వారు https://www.mudra.org.in/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO: Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!
తాజావార్తలు
-
Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
-
Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!