Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!
- ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై కారుమూరు వెంకట్ రెడ్డి ఆగ్రహం
- ప్రచురిత కథనం పూర్తిగా అవాస్తవమని ఖండన
- మీడియా స్వేచ్ఛకు హద్దులు అవసరమని వ్యాఖ్య
- ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై రాజకీయ బ్రోకరిజం ఆరోపణలు..
Karumuru Venkat Reddy: ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో హద్దులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా పేరిట వ్యక్తిగత అజెండాలతో, రాజకీయ బ్రోకరిజానికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా జ్ఞానం లేదా?.. ఆ ఛానెల్ కథనంపై భట్టి విక్రమార్క ఫైర్..
Also Read
ప్రతిరోజూ హద్దులు దాటి ప్రవర్తిస్తూ, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన థంబ్ నెయిల్స్ తో ప్రజల్లో మీడియాపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కొన్ని యూట్యూబ్ చానెళ్లకన్నా కూడా ఆంధ్రజ్యోతి స్థాయి దిగజారిందని వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాలు, కోడిపందేలు వంటి అంశాలపై ఒక పక్షపాతంతో కథనాలు రాస్తూ.. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సాంప్రదాయాన్ని ‘సుప్పిని శుద్దపూస’ లెక్క మహిళలపై, రాజకీయ నాయకుల కుటుంబాలపై, చివరకు దేవుళ్లపైనా అభ్యంతరకరమైన రాతలు, చిత్రాలను ప్రచురించడం మీడియా విలువలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి ధోరణి వల్లే తెలుగు మీడియా విశ్వసనీయత దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
CM Chandrababu: పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!
రాధాకృష్ణ రాజకీయ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని, ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ రాజకీయ లావాదేవీల్లో జోక్యం చేసుకుంటున్నారని కారుమూరు వెంకట్రెడ్డి అన్నారు. మీడియా పేరుతో రాజకీయ దళారీ చేస్తూ, అమాయకులను మోసం చేయడం సరికాదని స్పష్టం చేశారు. నిజంగా జర్నలిజం విలువలు ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఉంటే, ఇలాంటి విషపూరిత కథనాలను ఎప్పుడో తిరస్కరించేవారని అన్నారు. సమాజంలో విషబీజాలు నాటేలా రాయడమే కాకుండా.. వాటిని ‘కొత్త పలుకు’ అంటూ సమర్థించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాజకీయ నాయకులు, మీడియా సంస్థలు తమ పరిధుల్లో ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, లేదంటే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని కారుమూరు వెంకట్రెడ్డి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!