మార్కప్ ఛార్జీల పేరిట రూ.9,700 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే సంస్థ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలోనే విదేశాలకు వెళ్లే భారతీయులు దాదాపు రూ.95వేల కోట్లు (1270 కోట్ల డాలర్లు) ట్రాన్స్ఫర్ చేశారు. సదరు డబ్బులో 380 కోట్ల డాలర్లను ఉన్నత విద్య కోసం పంపగా.. పర్యటనల కోసం 320 కోట్ల డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ కోసం 270 కోట్ల డాలర్లను భారతీయులు పంపారు.
Read Also: వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
అయితే గతంలో భారతీయులు పంపే డబ్బులపై బ్యాంకులు అధికంగా ఛార్జీలు వసూలు చేసేవి. అయితే గత ఐదేళ్లుగా ఆ ఛార్జీలు తగ్గించి కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో 2016లో ప్రాసెసింగ్ ఫీజుల కింద బ్యాంకులు రూ.15,017 కోట్లు ఆర్జిస్తే.. 2019లో రూ.12,142 కోట్లు మాత్రమే ఆర్జించాయి. దీంతో ఆ లోటును పూడ్చుకునేందుకు బ్యాంకులు ఎక్స్ఛేంజ్ మార్కప్ పేరుతో ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛార్జీలను బ్యాంకులు భారీగా పెంచేశాయి. వాటి ద్వారా 2016లో బ్యాంకులకు రూ.2,505 కోట్లు రాగా 2019లో రూ.4,422 కోట్లు సమకూరాయి. 2020లో అయితే ఏకంగా రూ.9,700 కోట్లను బ్యాంకులు కొల్లగొట్టాయి. విదేశాలకు భారతీయులు పంపిన డబ్బులో ప్రాసెసింగ్ ఫీజు ద్వారా బ్యాంకులు రూ.26,300 కోట్లు సంపాదించాయి. ఇందులో మార్కప్ ఛార్జీల వాటా 36 శాతంగా ఉంది. ఈ ఛార్జీల గురించి చాలా మంది వినియోగదారులకు తెలియదు. బ్యాంకులు వసూలు చేస్తున్న ఈ ఛార్జీల దోపిడీ వల్ల ఎక్కువ నష్టపోతున్న వారిలో గల్ఫ్ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!