Airtel Micro ATM: బ్యాంకు కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పిన ఎయిర్టెల్.. ఇక కొత్త సేవలు..
ఎయిర్టెల్ మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఇది బ్యాంకు కస్టమర్లు అందరికీ ఎంతో ఉపయోగపడనుంది… ఎయిర్టెల్ ఏంటి? బ్యాంకు కస్టమర్లకు ఉపయోగపడే సేవను ప్రారంభించడమేంటి? అనే అనుమానాలు రావొచ్చు.. విషయం ఏంటంటే… ఎయిర్టెల్ మైక్రో ఏటీఎంని ప్రారంభించింది.. వాటి నుంచి ఏ బ్యాంకు కస్టమర్ అయినా.. నగదు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్లలో మైక్రో ఏటీఎం సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మైక్రో ఏటీఎం ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి రూ.10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. దశలవారీగా మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని ఈ సందర్భంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది.
Read Also: Astrology : సెప్టెంబర్ 29, గురువారం దినఫలాలు
Also Read
- Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
- Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!
- Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..
- Manappuram: నిబంధనలు ఉల్లంఘించిన మణప్పురం ఫైనాన్స్.. ఆగ్రహం వ్యక్తం చేసిన సెబీ..
కస్టమర్లకు మెరుగైన సౌకర్యాన్ని అందించేందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. మైక్రో ఏటీఎంను ప్రారంభించింది. దీనితో, దేశంలోని మెట్రో మరియు ఇతర నగరాల వెలుపల నివసిస్తున్న డెబిట్ కార్డ్ వినియోగదారులు నగదు ఉపసంహరణకు మెరుగైన సౌకర్యాన్ని పొందుతారు. వినియోగదారులకు నగదు ఉపసంహరణ సౌకర్యాలను అందించడానికి భారతదేశం అంతటా 5,00,000 బ్యాంకింగ్ పాయింట్ల నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు మైక్రో ఏటీఎం లావాదేవీలను సులభతరం చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మరియు నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)తో ఏకీకృతం చేయబడింది.. అన్ని బ్యాంకుల కస్టమర్లు మైక్రో ఏటీఎంల నుండి డబ్బు తీసుకోవచ్చు.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ పాయింట్లో మైక్రో ఏటీఎం సదుపాయాన్ని ఏ బ్యాంక్తో అనుబంధించిన కస్టమర్లు అయినా ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఒక కస్టమర్ మైక్రో ఏటీఎం ద్వారా ఒక్కో లావాదేవీకి రూ.10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు అని పేర్కొంది.
మొదట నగరాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో 1,50,000 యూనిట్లను ఏర్పాటు చేస్తుంది ఎయిర్టెల్. ఈ ప్రాంతాల్లో సాధారణంగా నగదు ఉపసంహరణ సేవలకు అధిక డిమాండ్ ఉంటుంది.. కానీ, ఏటీఎంల సంఖ్య పరిమితంగా ఉంటుంది. దీంతో, మైక్రో ఏటీఎంలపై దృష్టి సారించింది ఎయిర్టెల్.. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణేష్ అనంతనారాయణన్ మాట్లాడుతూ, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మా కస్టమర్లకు సాధికారత కల్పించేందుకు మైక్రో ఏటీఎంలను ప్రారంభించడం మరో ముందడుగు.. ఇది తమ బ్యాంక్ ప్రారంభించిన మొదటి పరికరం.. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది.. ఎందుకంటే ఇది డెబిట్ కార్డ్లను ఉపయోగించి ఏదైనా బ్యాంక్ కస్టమర్లకు సేవలను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు..
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!