Air India: గల్ఫ్ వెళ్లే వారికి బ్యాడ్ న్యూస్.. రన్ వే పైనే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానాలు! అసలు కారణమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరడంతో, ఎయిర్ ఇండియా తన మధ్యప్రాచ్య సర్వీసులన్నింటినీ తక్షణమే నిలిపివేసింది. ముఖ్యంగా దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ వంటి నగరాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించింది.
READ ALSO: Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
Also Read
- mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
ఆపరేషన్ రోరింగ్ లయన్..
అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ ప్రారంభించిన “ఆపరేషన్ రోరింగ్ లయన్” ఇరాన్పై దాడులను ఉధృతం చేసింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా ఎదురుదాడికి దిగడంతో గల్ఫ్ ప్రాంతమంతా గగనతలం (Airspace) మూతపడింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (AI139), గగనతలంలో ప్రమాదాన్ని పసిగట్టి మధ్యలోనే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, రియాద్, జెడ్డా, దమ్మామ్, ఖతార్ (దోహా), ఒమన్ (మస్కట్), ఇజ్రాయెల్ (టెల్ అవీవ్)లకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో కూడా అప్రమత్తమైంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా స్థితిగతులను నిశితంగా గమనిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన వేళల్లో మార్పులు చేస్తామని పేర్కొంది. ప్రయాణికులు తమ విమాన స్థితిని (Flight Status) ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే బ్రిటన్.. ఇరాన్ నుంచి తన సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఫ్రాన్స్ & ఇటలీ కూడా తమ పౌరులను తక్షణమే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాలను విడిచి రావాలని ఆదేశించాయి. జర్మనీ.. ఇజ్రాయెల్ ప్రయాణాలపై కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. మీరు గల్ఫ్ దేశాలకు ప్రయాణించాల్సి ఉంటే, విమానాశ్రయానికి బయలుదేరే ముందే ఎయిర్లైన్స్ వెబ్సైట్ లేదా యాప్లో మీ విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Stocks India 2026: అదృష్టం అంటే ఇదే.. రూ.8 షేరు.. రూ.2,887 కు జంప్!
తాజావార్తలు
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!