Aditya Birla Group: రూ.5000 కోట్ల ప్రణాళిక..రిలయన్స్-టాటాలకు ఆదిత్య బిర్లా గట్టి పోటీ?
- ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ఎంట్రీ
- టాటా-తనిష్క్.. రిలయన్స్-జ్యువెల్స్కు గట్టిపోటీ
- రూ.5000 కోట్ల ప్రణాళికతో ఇంద్రీయ బ్రాండ్
- ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు పెయింట్ తర్వాత ఆభరణాల మార్కెట్లోకి వచ్చింది. గ్రూప్ శుక్రవారం తన ఆభరణాల బ్రాండ్ ఇంద్రీయను ప్రారంభించింది. ఇందులో టాటా గ్రూప్కు చెందిన తనిష్క్, రిలయన్స్కు చెందిన రిలయన్స్ జ్యువెల్స్తో గ్రూప్కు ప్రధాన పోటీ ఉంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ఏడాది ప్రారంభంలో పెయింట్ వ్యాపారంలోకి ప్రవేశించింది. సిమెంట్ వ్యాపారంలో అదానీ గ్రూప్కు గట్టి పోటీనిస్తోంది. అంతేకాకుండా.. తన టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి కూడా దూకుడు విధానాన్ని అవలంబిస్తోంది. రిటైల్ బ్రాండెడ్ జ్యువెలరీ వ్యాపారంలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశంతో టాటా యొక్క ఆభరణాల బ్రాండ్ తనిష్క్ గట్టి పోటీని ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. తనిష్క్ తన మొదటి షోరూమ్ను 1996లో చెన్నైలో ప్రారంభించింది.
READ MORE: Student Suicide: భవనంపై నుంచి దూకి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
$65 బిలియన్ల ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క ప్రధాన దృష్టి మెటల్, సిమెంట్, వస్త్ర వ్యాపారంపై ఉంది. కానీ ఇప్పుడు ఇది వినియోగదారుల వ్యాపారంలో వేగంగా విస్తరిస్తోంది. ఇంద్రియ బ్రాండ్ను ప్రారంభించిన గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో మా ఆదాయంలో వినియోగదారుల వ్యాపారం వాటా 25% కంటే ఎక్కువ పెరిగి సుమారు 25 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని చెప్పారు. అదే జరిగితే.. దేశంలోని అన్ని ప్రముఖ స్వతంత్ర వినియోగదారు వ్యాపారాల కంటే ఇది అగ్ర స్థానంలో నిలుస్తుంది.
READ MORE:Jammu Kashmir: కాశ్మీర్లో మరో 2000 మంది బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు..
రూ.5000 కోట్ల ప్రణాళిక..
కొత్త వెంచర్ల పురోగతి బాగుంటేనే మన వ్యాపారాల్లో చాలా వరకు విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉన్నాయని కుమార్ మంగళం బిర్లా అన్నారు. “మేము పరిమాణాన్ని పెంచుకోవడమే కాకుండా మా పరిధిని కూడా విస్తరిస్తాం. అదే సమయంలో..మా పాత వ్యాపారాల బలాన్ని మా కొత్త వెంచర్ల తాజా శక్తితో కలపడం ద్వారా ప్రత్యేకమైన వృద్ధిని సృష్టిస్తాం. ఆదిత్య బిర్లా గ్రూప్ నగల వ్యాపారంలో దాదాపు రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. బ్రాండ్ వాల్యూ, రిటైల్ అనుభవం ఆధారంగా జగన్ ను మొదటి మూడు స్థానాల్లో నిలబెట్టవచ్చు.” అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ MORE:Kidnap: బ్యాంకాక్లో నంద్యాల జిల్లా వాసి కిడ్నాప్
కాగా.. ఇంద్రియ మొదటి నాలుగు స్టోర్లు శనివారం ఢిల్లీ, జైపూర్, ఇండోర్లలో తెరవబడతాయి. వచ్చే ఆరు నెలల్లో 10కి పైగా నగరాల్లో ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆభరణాల మార్కెట్ విలువ రూ.6.7 లక్షల కోట్లుగా ఉంది. ఇది 2030 నాటికి రూ.11 నుంచి 13 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!