బిగ్ బాస్ హౌస్ లో యాభై రోజులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా భాషలో చెప్పుకోవాలంటే… బిగ్ బాస్ సీజన్ 5 అర్థశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది! 19 మంది సభ్యులతో మొదలైన ఈ షో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదీ లేకుండానే యాభై రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన వారి నుండి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్, హమీదా, శ్వేతవర్మ, ప్రియా వెళ్ళిపోగా ఇంకా 12 మంది మాత్రం మిగిలారు. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఈ సారి బిగ్ బాస్ టఫ్ టాస్క్ ఏదీ ఇవ్వకుండా హౌస్ లోని సభ్యుల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు. యాభై రోజులు హౌస్ లో ఉన్న మెంబర్స్ ను అభినందిస్తూనే, వారికి ఇష్టమైన వారి నుండి వచ్చిన లేఖను ఎదుటి వ్యక్తుల కోసం ఎవరెవరు త్యాగం చేస్తారనే పరీక్ష పెట్టాడు. చిత్రం ఏమంటే… ఎవరైతే తమ ఇంటి వారి నుండి వచ్చిన లేఖ క్రష్ కావడానికి సిద్ధపడి, ఎదుటివారికి ఛాన్స్ ఇస్తారో వారు నామినేషన్స్ లోనూ ఉంటారు!
ఈ గేమ్ లో తొలుత శ్రీరామ్, మానస్ జోడీకి లోబో, ప్రియాంక ఫ్యామిలీస్ కు చెందిన లేఖలు అందాయి. ప్రియాంక హౌస్ లోకి వచ్చిన తర్వాత తొలిసారి తన తండ్రి నుండి పాజిటివ్ మెసేజ్ రావడంతో తల్లిదండ్రుల నుండి వచ్చిన లేఖను తనకు ఇవ్వమని లోబోను కోరింది. లోబో తనకు భార్య రాసిన లేఖను క్రష్ చేసి, ప్రియాంకకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక రవి, షణ్ముఖ్ జోడీ చేతికి విశ్వ, సిరి లేఖలు వచ్చాయి. ఈసారి సిరి త్యాగం చేసి, విశ్వకు అతని కొడుకు రాసిన లేఖ చదువుకునే అవకాశం ఇచ్చింది. సిరి, యానీ మాస్టర్ చేతికి షణ్ముఖ్, కాజల్ లేఖలు రాగా కాస్తంత నాటకీయ పరిణామాల మధ్య షణ్ముఖ్ తాను త్యాగం చేసి, కాజల్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ప్రియాంక, కాజల్ జోడీకి యానీ, మానస్ లేఖలు రాగా, మానస్ త్యాగరాజు అయిపోయి, యానీ మాస్టర్ కు లేఖ చదువుకునే ఛాన్స్ ఇచ్చాడు. విశ్వ, లోబో జోడీకి రవి, శ్రీరామ్ లేఖలు రాగా, రవి ఛాన్స్ శ్రీరామ్ కు ఇచ్చాడు. సన్నీ కెప్టెన్ అయినందున అతనికి డైరెక్ట్ గా అతని తల్లి రాసిన లేఖను బిగ్ బాస్ అందించాడు. ఇక జెస్సీకి అతని ఫ్యామిలీ మెంబర్స్ రాసిన లేఖ చదవాలంటే, ఇప్పటికే సేవ్ అయిన ఎవరో ఒకరు త్యాగం చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. దాంతో శ్రీరామ్, జెస్సీ వారించినప్పటికీ తన లేఖను త్యాగం చేశాడు. అయితే… తన త్యాగం వల్ల శ్రీరామ్ కు ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి, తానో సజెషన్ చేస్తానని రవి మరో ట్రిక్ ప్లే చేయబోతున్నాడు. కానీ షణ్ణు, సిరి దానిని ఖండించారు. ఈ సందర్భాన్ని వేరే దానికి ఉపయోగించవద్దని రవికి సున్నితంగా చెప్పారు. దాంతో రవి మౌనం పాటించాడు.
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
మొత్తం మీద సోమవారం బిగ్ బాస్ సభ్యులతో సెంటిమెంట్ గేమ్ ఆడి, ఫైనల్గా లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ లను నామినేషన్స్ లో పెట్టాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
-
Gold and Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!