Koti Deepotsavam 2024 Day 8: కార్తిక శనివారం శుభవేళ.. కోటిదీపోత్సవం వేదికపై వరసిద్ధి వినాయకుడి కల్యాణం..
- ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ కోటి దీపోత్సవం వేడుక..
- ఎనిమిదో రోజు విశేష కార్యక్రమాలు..
- వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన..
- భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన..
- కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2024 Day 8: కార్తిక మాసం శుభవేళ.. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది.. రోజుకో కల్యాణం.. వాహనసేవలు, పీఠాధిపతుల ప్రవచనాలు.. ప్రముఖుల ఉపన్యాసాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా భక్తులను కోటి దీపోత్సవ వేదిక కట్టిపడేస్తోంది.. పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇప్పటికే ఏడు రోజుల విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోగా.. ఈ రోజు ఎనిమిదో రోజు మరిన్ని కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది భక్తి టీవీ..

Also Read
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఈ రోజు జరనున్న విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. శ్రీ సుబ్రహ్మణ్యమఠం మాఠాధిపి శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు.. ప్రవచనామృతం.. వేదికపై కాజీపేట శ్వేతార్క గణపతికి సప్తవర్ణ మహాభిషేక సహిత కోటి గరికార్చన.. భక్తులచే గణపతి విగ్రహాలకు కోటి గరికార్చన.. కోటి దీపోత్సవ వేదికపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి మూషిక వాహన సేవ నిర్వహించనున్నారు.. కోటి దీపోత్సవానికి అందరూ ఆహ్వానితులే.. కార్తిక మాసం శుభవేళ కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిందిగా భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచన టెలివిజన్ ప్రైవెట్ లిమిటెడ్.. ఈ ఉత్సవంలో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రి కూడా భక్తి టీవీ ఉచితంగా అందజేస్తోన్న విషయం విదితమే కాగా.. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోన్న విషయం విదితమే..

ఇక, నిన్నటి కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు.. “కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగిన కోటి దీపోత్సవంలో సతీ సమేతంగా పాల్గొనడం జరిగింది. దీపకాంతుల నడుమ.. హిందూ సాంప్రదాయ వైభవం.. ఆధ్యాత్మిక ప్రాభవం.. కలగలిసిన అనుభూతి పొందాను. ఈ శుభ దినాన.. ఆ మహాశివుడి ఆశీస్సులు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పై.. చల్లని వెన్నెల్లా ప్రసరించాలని.. కోరుకున్నాను.” అంటూ సోషల్ మీడియా వేదికగా కోటి దీపోత్సవం ఫొటోలు పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి..
తాజావార్తలు
-
Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!