Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitragupta Temple Telugu Vlog in Hyderabad: ఏ తెలుగు ఇంట చూసినా ఎన్టీవీ వార్తలు వినిపించాల్సిందే, భక్తి టీవీ పాటలు, మహనీయుల శ్రవణాల గొంతులు వినిపించాల్సిందే. తెలుగు వారిలో ఒక భాగమైపోయిన భక్తి టీవీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వీలాగ్స్ చేయడం మొదలు పెట్టింది. మొదటిగా చిత్రగుప్తుడి ఆలయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాల పుణ్యమా అని మనందరికీ తెలుసు. అయితే అలాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు. ఆయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది,. ఆ ఆలయమే ఇప్పుడు ధర్మ హరి చిత్రగుప్త దేవాలయంగా వర్ధిల్లుతుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, రామ్ఘాట్, ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక చిత్రగుప్తుడికి సౌతిండియాలో కేవలం రెండే రెండు ఆలయాలున్నాయి. అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో అదీ హైదరాబాద్లో ఉండటం గమనార్హం. అది కూడా ఫలక్ నామలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్తు మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మక తప్పదు. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది.
Also Read
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
- Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
Krithy Shetty: యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిస్తోంది.. పోలీసులకు సహకరించాలి!
భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుణ్ని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా కొలిచేవారని చెబుతారు. కాయస్థ వంశీయుడు, అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారని నమ్మిక. చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కాయస్థ వంశీయులు కేతు గ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుణ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేవారు. అయితే కాలక్రమేణా ఆ వంశస్తులు అంతరించిపోవడం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైనా 1980లలో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడంతో వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దాతల సాయంతో చిత్రగుప్తుడి పక్కనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు.
అభిషేకానికి సంబంధించిన వివరాలు కావాలంటే క్రింది వీడియో క్లిక్ చేయండి
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!