Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chitragupta Temple Telugu Vlog in Hyderabad: ఏ తెలుగు ఇంట చూసినా ఎన్టీవీ వార్తలు వినిపించాల్సిందే, భక్తి టీవీ పాటలు, మహనీయుల శ్రవణాల గొంతులు వినిపించాల్సిందే. తెలుగు వారిలో ఒక భాగమైపోయిన భక్తి టీవీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వీలాగ్స్ చేయడం మొదలు పెట్టింది. మొదటిగా చిత్రగుప్తుడి ఆలయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాల పుణ్యమా అని మనందరికీ తెలుసు. అయితే అలాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు. ఆయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది,. ఆ ఆలయమే ఇప్పుడు ధర్మ హరి చిత్రగుప్త దేవాలయంగా వర్ధిల్లుతుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, రామ్ఘాట్, ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక చిత్రగుప్తుడికి సౌతిండియాలో కేవలం రెండే రెండు ఆలయాలున్నాయి. అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో అదీ హైదరాబాద్లో ఉండటం గమనార్హం. అది కూడా ఫలక్ నామలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్తు మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మక తప్పదు. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది.
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
Krithy Shetty: యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిస్తోంది.. పోలీసులకు సహకరించాలి!
భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుణ్ని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా కొలిచేవారని చెబుతారు. కాయస్థ వంశీయుడు, అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారని నమ్మిక. చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కాయస్థ వంశీయులు కేతు గ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుణ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేవారు. అయితే కాలక్రమేణా ఆ వంశస్తులు అంతరించిపోవడం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైనా 1980లలో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడంతో వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దాతల సాయంతో చిత్రగుప్తుడి పక్కనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు.
అభిషేకానికి సంబంధించిన వివరాలు కావాలంటే క్రింది వీడియో క్లిక్ చేయండి
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?