Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?
Chitragupta Temple Telugu Vlog in Hyderabad: ఏ తెలుగు ఇంట చూసినా ఎన్టీవీ వార్తలు వినిపించాల్సిందే, భక్తి టీవీ పాటలు, మహనీయుల శ్రవణాల గొంతులు వినిపించాల్సిందే. తెలుగు వారిలో ఒక భాగమైపోయిన భక్తి టీవీ ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వీలాగ్స్ చేయడం మొదలు పెట్టింది. మొదటిగా చిత్రగుప్తుడి ఆలయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడు గురించి తెలుగు సినిమాల పుణ్యమా అని మనందరికీ తెలుసు. అయితే అలాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అందదు. ఆయితే శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి ఆలయం కట్టించి పూజించినట్లు పురాణాల్లో ఉంది,. ఆ ఆలయమే ఇప్పుడు ధర్మ హరి చిత్రగుప్త దేవాలయంగా వర్ధిల్లుతుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, రామ్ఘాట్, ఉజ్జయిని ప్రాంతాల్లో కూడా చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. ఇక చిత్రగుప్తుడికి సౌతిండియాలో కేవలం రెండే రెండు ఆలయాలున్నాయి. అందులో ఒకటి తమిళనాడు కంచిలో ఉండగా మరొకటి మన రాష్ట్రంలో అదీ హైదరాబాద్లో ఉండటం గమనార్హం. అది కూడా ఫలక్ నామలోని కందికల్ గేట్ దగ్గర చిత్రగుప్తు మహాదేవ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మక తప్పదు. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న శతాబ్దాలనాటి చిత్రగుప్త ఆలయం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉంది.
Also Read
- Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
- Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
- Garuda Purana: చనిపోయిన తర్వాత 13 రోజులు ఆత్మ ఎక్కడ ఉంటుంది? గరుడ పురాణం చెప్పిన నిజం!!
Krithy Shetty: యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడం బాధ కలిస్తోంది.. పోలీసులకు సహకరించాలి!
భూలోకానికి అప్పుడప్పుడు వచ్చిపోయే చిత్రగుప్తుడికి ఈ దేవాలయం నివాసం అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడిలో కొలువైన చిత్రగుప్తుణ్ని నవాబుల వద్ద పనిచేసే గుమాస్తాలు ఆరాధ్య దైవంగా కొలిచేవారని చెబుతారు. కాయస్థ వంశీయుడు, అప్పటి మంత్రి రాజా కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారని నమ్మిక. చిత్రగుప్తుడితో పాటు ఆయన భార్యలు నందిని, శోభావతి విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు. కాయస్థ వంశీయులు కేతు గ్రహానికి గురువుగా భావించే చిత్రగుప్తుణ్ని పూజిస్తే దోష నివారణ జరుగుతుందని ప్రగాఢంగా నమ్మేవారు. అయితే కాలక్రమేణా ఆ వంశస్తులు అంతరించిపోవడం వల్ల ఈ ఆలయం నిరాదరణకు గురైనా 1980లలో ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావడంతో వివిధ రాష్ట్రాల భక్తులు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దాతల సాయంతో చిత్రగుప్తుడి పక్కనే రామాలయం, శివాలయం, సాయిబాబా, ఆంజనేయస్వామి, అయ్యప్ప ఆలయాలు కూడా నిర్మించారు.
అభిషేకానికి సంబంధించిన వివరాలు కావాలంటే క్రింది వీడియో క్లిక్ చేయండి
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!