Tesla Cars Discounts: ఈ కారుకు రెండు లక్షల డిస్కౌంట్.. అయినా కొనే వాళ్ళు లేరే!
- భారత మార్కెట్లో టెస్లాకు లభించడం ఆదరణ..
- అమ్ముడుపోకుండా మిగిలిపోయిన కార్లకు డిస్కౌంట్లు..
Tesla Cars Discounts: భారత మార్కెట్లో అడుగు పెట్టిన టెస్లా ఇన్క్కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గత ఏడాది భారత్కు దిగుమతి చేసిన తొలి వాహనాల్లో దాదాపు మూడో వంతు కార్లు ఇప్పటికీ అమ్ముడుపోకుండా మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో బుకింగ్లు చేసిన కొందరు కొనుగోలుదారులు తరువాత వెనక్కి తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది.
Read Also: Jigris Movie OTT: పండగ వేళ థియేటర్ల వద్ద సినిమాల రచ్చ.. ఓటీటీలో ‘జిగ్రిస్’ ఊచకోత!
Also Read
- BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
ఇక, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా సంస్థ సుమారు నాలుగు నెలల క్రితం భారత్కు 300 మోడల్ వై (Model Y) ఎస్యూవీ వాహనాలను తెచ్చింది. అయితే, వీటిలో దాదాపు 100 వాహనాలకు ఇప్పటికీ అమ్ముడుపోలేదు. దీంతో మిగిలిన స్టాక్ను తగ్గించేందుకు, కొన్ని వేరియంట్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. కాగా, భారత్లో జూలైలో టెస్లా కార్లు అధికారికంగా ప్రవేశించాయి. దిగుమతి కార్లపై 110 శాతం వరకు పన్నులు ఉన్నప్పటికీ, బ్రాండ్ విలువతోనే విక్రయాలు పెరుగుతాయని కంపెనీ ఆశించింది. కానీ, ఇది అంత తేలికగా సాధ్యపడడం లేదని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు, నిల్వలపై టెస్లా మాత్రం ఇంకా స్పందించలేదు.
Read Also: Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్లో మరో మైలురాయి!
అయితే, ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు డిమాండ్ మందగిస్తోంది. 2025లో వరుసగా రెండో ఏడాదీ కంపెనీ గ్లోబల్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకందారుగా చైనా సంస్థ బీవైడీ (BYD) నిలిచింది. అమెరికా, యూరప్, చైనా లాంటి కీలక మార్కెట్లలో పెరుగుతున్న పోటీ, కొన్ని దేశాల్లో సబ్సిడీలు తగ్గడం టెస్లా మార్కెట్ వాటాను ప్రభావితం చేస్తున్నాయి. భారత్లోనూ అధిక ధరలు, బ్రాండ్పై పరిమిత అవగాహన కారణంగా కొనుగోలుదారులు పూర్తిగా ఆకర్షితులు కావడం లేదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా, ఈ పరిస్థితుల్లో భారత మార్కెట్ను బలోపేతం చేసేందుకు టెస్లా కీలక చర్యలు తీసుకుంటోంది. గత నవంబర్లో లాంబోర్గినీ ఇండియా మాజీ హెడ్ శరద్ అగర్వాల్ను భారత్ కార్యకలాపాల అధిపతిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
jyotipoorvaj : పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా తన అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
-
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
-
OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!