Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
- ఈవీ కార్ మార్కెట్లో దూసుకుపోతున్న టాటా మోటార్స్..
- టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
- సియెర్రా. ఈవీ, అవెన్యాతో పాటు ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త కార్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఇందులో సియెర్రా. ev(Sierra.ev), అప్డేటెడ్ పంచ్.ev ( Punch.ev) 2026 తొలి అర్థభాగంలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అదే ఏడాది చివరి నాటికి టాటా నుంచి తొలిసారిగా ప్రీమియం ఈవీ కార్ ‘అవిన్యా’(Avinya) రాబోతోంది. FY2027, FY2030 మధ్య మరో మూడు కొత్త ఈవీ మోడళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది.
Also Read
- Kia Seltos GTX(O): కియా సెల్టోస్ రెండు కొత్త వేరియంట్లు రిలీజ్.. Level 2+ ADAS, అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?
- Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
- Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
Read Also: MEA: బంగ్లాదేశ్లో హిందువుల హత్యలను ఖండించిన భారత్..
టాటా మోటార్స్ ఇప్పటికే భారత్లో మొత్తం 2.5 లక్షల ఈవీల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్లలో ఒక్క టాటా నుంచే 65 శాతం కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, టాటా నుంచి వచ్చిన నెక్సాన్.ఈవీ(Nexon.ev) ఒక్కటే లక్షకు మించిన అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో లక్ష మార్కును దాటిని తొలి ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది. టాటా మోటార్స్ తన ఈవీ కస్టమర్లలో తొలిసారిగా ఈవీని కొనుగోలు చేసిన వారు 26 శాతం మంది ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం, టాటా నుంచి టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, హరియర్ ఈవీలు ఉన్నాయి.
మరోవైపు, టాటా మోటార్స్ తన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరుచుకుంది. టాటా ఈవీ ఓపెన్ కొలాబరేషన్ ఫ్రేమ్వర్క్ కింద సుమారు 4 లక్షల ఛార్జింగత్ పాయింట్లు ఉన్నాయి. ఇందుల్లో 30,000కు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉ న్నాయి. 2030 నాటికి వీటిని 10 లక్షల చార్జింగ్ పాయింట్లకు, ఇందులో కనీసం 1 లక్షలకు పైగా ఫాస్ట్ చార్జర్లు ఉండాలని ప్లాన్ చేస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!