OLA: క్రిస్మస్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు
- దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా
- ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారుగా కంపెనీ
- ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు. ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్ ఉండేలా కొత్త స్టోర్లను ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీ ప్రతి జిల్లా, టౌన్ లో ఉండేటట్లుగా ప్లాన్ చేశామని, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంటామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో లక్ష మందికి పైగా పాల్గొన్నారని వెల్లడించారు.ఇప్పుడు ఓలా ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉందని భవిష్ పేర్కొన్నారు.
Also Read
- Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
- Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
- E3 Tryon: E3 ట్రయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 165KM రేంజ్, AI ఫీచర్లు.. ధర ఎంతంటే?
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
కొత్త రంగు స్కూటర్..
అంతే కాకుండా.. కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా క్రిస్మస్ సందర్భంగా కొత్త రంగు ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. కంపెనీ ఓలా ఎస్1 ప్రో గోల్డ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. ఓలా నిర్వహించే ప్రత్యేక పోటీ ద్వారా ఈ బంగారు రంగు స్కూటర్ను గెలుచుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేవలకు సంబంధించి ఓలా అనేకసార్లు వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని కంపెనీ చెప్పుకొచ్చింది.
కంపెనీ షేర్లు పెరిగాయి
ఇదిలా ఉండగా.. మంగళవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 1.53% లాభపడ్డాయి. ఈ పెరుగుదలతో దాని షేర్లు రూ.94.05 వద్ద ముగిశాయి. చాలా రోజుల తర్వాత కంపెనీ షేర్లు పెరిగాయి. అంతకుముందు.. అనేక వివాదాల కారణంగా కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. కంపెనీ షేర్లు ఇప్పటికీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.157.53 కంటే చాలా దిగువన ఉన్నాయి.
తాజావార్తలు
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!