OLA: క్రిస్మస్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు
- దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా
- ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారుగా కంపెనీ
- ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రిస్మస్ సందర్భంగా భవిష్ అగర్వాల్కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ దేశవ్యాప్తంగా 3200 కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీంతో కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 4000కు చేరింది. ఓలా భారతదేశపు అతిపెద్ద ఈవీ పంపిణీదారు కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా తెలిపారు. ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్ ఉండేలా కొత్త స్టోర్లను ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు. కంపెనీ ప్రతి జిల్లా, టౌన్ లో ఉండేటట్లుగా ప్లాన్ చేశామని, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంటామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో లక్ష మందికి పైగా పాల్గొన్నారని వెల్లడించారు.ఇప్పుడు ఓలా ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉందని భవిష్ పేర్కొన్నారు.
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
కొత్త రంగు స్కూటర్..
అంతే కాకుండా.. కొత్త స్టోర్లను ప్రారంభించిన ఓలా క్రిస్మస్ సందర్భంగా కొత్త రంగు ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. కంపెనీ ఓలా ఎస్1 ప్రో గోల్డ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. ఓలా నిర్వహించే ప్రత్యేక పోటీ ద్వారా ఈ బంగారు రంగు స్కూటర్ను గెలుచుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేవలకు సంబంధించి ఓలా అనేకసార్లు వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తామని కంపెనీ చెప్పుకొచ్చింది.
కంపెనీ షేర్లు పెరిగాయి
ఇదిలా ఉండగా.. మంగళవారం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 1.53% లాభపడ్డాయి. ఈ పెరుగుదలతో దాని షేర్లు రూ.94.05 వద్ద ముగిశాయి. చాలా రోజుల తర్వాత కంపెనీ షేర్లు పెరిగాయి. అంతకుముందు.. అనేక వివాదాల కారణంగా కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. కంపెనీ షేర్లు ఇప్పటికీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.157.53 కంటే చాలా దిగువన ఉన్నాయి.
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరు ఉన్నారంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!