Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఛార్జింగ్ సదుపాయాలు ఇండియా వ్యాప్తంగా విస్తరించపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే కాలంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాల కోసం దేశీయ ఆటోమేకర్ మహీంద్రా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-బీపి, స్టాటిక్, ఛార్జ్+జోన్ అనే మూడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. మహీంద్రా ఈవీ వినియోగదారుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Also Read
- BMW Vision K18: భవిష్యత్ హై-పర్ఫార్మెన్స్ టూరింగ్ బైక్.. బీఎండబ్ల్యూ విజన్ K18 ఆవిష్కరణ
- Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
- Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
- Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
Read Also: Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
ఇటీవల తన మహీంద్ర తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్యూవీ 400ను తీసుకువచ్చింది. రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. గత నెలలో జియో బీపీ, రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని వేగం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా టాప్ ప్లేసులో ఉంది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. మహీంద్రా తన ఎక్స్యూవీ 400ని లాంచ్ చేసింది. ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీని అమ్ముతోంది. హ్యుందాయ్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..