Mahindra: మహీంద్రా తన ఈవీల ఛార్జింగ్ కోసం మూడు కంపెనీలతో ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Partners With Three EV Infrastructure Firms to Build Charging Stations for Upcoming Vehicles: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పలు కంపెనీలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ కార్లులు, బైకుల ఉత్పత్తిని మరింగా పెంచుతున్నాయి. ఇప్పటికే టాటా, ఎంజీ, మహీంద్రా, కియా, హ్యుందాయ్, బీవైడీ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశాయి. రానున్న కాలంలో మరిన్ని మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా మంది వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పటికీ.. ఛార్జింగ్ సదుపాయాలు ఇండియా వ్యాప్తంగా విస్తరించపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాబోయే కాలంలో తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాల కోసం దేశీయ ఆటోమేకర్ మహీంద్రా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జియో-బీపి, స్టాటిక్, ఛార్జ్+జోన్ అనే మూడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం తెలిపింది. మహీంద్రా ఈవీ వినియోగదారుల కోసం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాలను విస్తరించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Also Read
- Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
- Norton Atlas India: భారత మార్కెట్లోకి నార్టన్ బైక్స్.. హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం.. జూలైలో గ్లోబల్ లాంచ్!
Read Also: Revanth Reddy: బీజేపీ, టీఆర్ఎస్.. విక్రమార్కుడులో రవితేజ, బ్రహ్మానందం లెక్క
ఇటీవల తన మహీంద్ర తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్యూవీ 400ను తీసుకువచ్చింది. రానున్న కాలంలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. గత నెలలో జియో బీపీ, రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ దిగ్గజాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తిని వేగం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో టాటా టాప్ ప్లేసులో ఉంది. టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. మహీంద్రా తన ఎక్స్యూవీ 400ని లాంచ్ చేసింది. ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీని అమ్ముతోంది. హ్యుందాయ్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కార్ ప్రస్తుతం మార్కెట్ లో ఉంది.
తాజావార్తలు
-
Maa Inti Bangaram: వైజాగ్ సక్సెస్ మీట్లో బిగ్ సర్ప్రైజ్.. ‘మా ఇంటి బంగారం 2’ అధికారికంగా ప్రకటించిన రాజ్
-
US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!