Congress: సావర్కర్ గోహత్యకు వ్యతిరేకం కాదు, గొడ్డు మాంసం తినేవాడు.. కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..
- సావర్కర్ బీఫ్ తినే వాడు..
- కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- హిందువుల్ని ఎందుకు కాాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది..? విరుచుకుపడిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: వీర్ సావర్కర్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సావర్కర్ ‘‘గొడ్డు మాంసం’’ తినేవాడని అతను వ్యాఖ్యానించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. వినాయక్ దామోదర్ మాంసాహారే అని గోహత్యకు వ్యతిరేకం కాదని ఆయన కామెంట్స్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా బెంగళూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేష్ గుండూరావు మాట్లాడుతూ..సావర్కర్ బీఫ్ తినేవాదని అన్నారు. సావర్కర్ బ్రహ్మణుడైనప్పటికీ సంప్రదాయ ఆహార నియంత్రణల్ని పాటించలేదని, ఆధునికవాది అని మంత్రి అన్నారు. సావర్కర్ అభిప్రాయాలతో మహాత్మా గాంధీ విభేదించేవారని, సావర్కర్ భావజాతం ఛాందసవాదం వైపు మొగ్గు చూపుతుందని, గాంధీ విశ్వాసాలు లోతైన ప్రజాస్వామ్యమని మంత్రి పేర్కొన్నాడు. గాంధీ హిందూ సాంస్కృతిక సంప్రదాయవాదంపై లోతైన విశ్వాసం కలిగిన కఠినమైన శాఖాహారి అని, ఇద్దరు నేతల మధ్య వ్యత్యాసాన్ని చెప్పాడు. ఇదే కాకుండా దినేష్ గుండూరావు మహ్మద్ అలీ జిన్నా గురించి కూడా వ్యాఖ్యానించారు. జిన్నా ఎప్పుడూ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ కాదని, అతను పందిమాంసం కూడా తినేవారని కొందరు చెబుతుండేవారని చెప్పారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Hamas: హమాస్ గాజా చీఫ్ ఖతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి..
కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆర్ అశోక్ స్పందించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దేవుడు టిప్పు సుల్తాన్, కాంగ్రెస్ ఎల్లప్పుడు హిందువుల్ని టార్గెట్ చేస్తుంది, ముస్లింలను ఎందుకు టార్గెట్ చేయడు..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హిందువులు తీర్పు చెబుతారని, ప్రతీ హిందువు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులకు(కాంగ్రెస్) సావర్కర్ గురించి ఏం తెలియదు, సావర్కర్ ఆవులపై తన అభిప్రాయాలను చాలా చక్కగా చెప్పారని, ఆవులు రైతులకు పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా సాయం చేస్తాయని, అందుకే ఆవుని దేవతతో సమానంగా కొలుస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..