Congress: సావర్కర్ గోహత్యకు వ్యతిరేకం కాదు, గొడ్డు మాంసం తినేవాడు.. కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..
- సావర్కర్ బీఫ్ తినే వాడు..
- కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- హిందువుల్ని ఎందుకు కాాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది..? విరుచుకుపడిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: వీర్ సావర్కర్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత, కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సావర్కర్ ‘‘గొడ్డు మాంసం’’ తినేవాడని అతను వ్యాఖ్యానించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది. వినాయక్ దామోదర్ మాంసాహారే అని గోహత్యకు వ్యతిరేకం కాదని ఆయన కామెంట్స్ చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా బెంగళూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దినేష్ గుండూరావు మాట్లాడుతూ..సావర్కర్ బీఫ్ తినేవాదని అన్నారు. సావర్కర్ బ్రహ్మణుడైనప్పటికీ సంప్రదాయ ఆహార నియంత్రణల్ని పాటించలేదని, ఆధునికవాది అని మంత్రి అన్నారు. సావర్కర్ అభిప్రాయాలతో మహాత్మా గాంధీ విభేదించేవారని, సావర్కర్ భావజాతం ఛాందసవాదం వైపు మొగ్గు చూపుతుందని, గాంధీ విశ్వాసాలు లోతైన ప్రజాస్వామ్యమని మంత్రి పేర్కొన్నాడు. గాంధీ హిందూ సాంస్కృతిక సంప్రదాయవాదంపై లోతైన విశ్వాసం కలిగిన కఠినమైన శాఖాహారి అని, ఇద్దరు నేతల మధ్య వ్యత్యాసాన్ని చెప్పాడు. ఇదే కాకుండా దినేష్ గుండూరావు మహ్మద్ అలీ జిన్నా గురించి కూడా వ్యాఖ్యానించారు. జిన్నా ఎప్పుడూ హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ కాదని, అతను పందిమాంసం కూడా తినేవారని కొందరు చెబుతుండేవారని చెప్పారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
Read Also: Hamas: హమాస్ గాజా చీఫ్ ఖతం.. ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మృతి..
కాంగ్రెస్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఆర్ అశోక్ స్పందించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ దేవుడు టిప్పు సుల్తాన్, కాంగ్రెస్ ఎల్లప్పుడు హిందువుల్ని టార్గెట్ చేస్తుంది, ముస్లింలను ఎందుకు టార్గెట్ చేయడు..? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హిందువులు తీర్పు చెబుతారని, ప్రతీ హిందువు వారికి గుణపాఠం చెబుతారని అన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులకు(కాంగ్రెస్) సావర్కర్ గురించి ఏం తెలియదు, సావర్కర్ ఆవులపై తన అభిప్రాయాలను చాలా చక్కగా చెప్పారని, ఆవులు రైతులకు పుట్టినప్పటి నుంచి చనిపోయే దాకా సాయం చేస్తాయని, అందుకే ఆవుని దేవతతో సమానంగా కొలుస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!