Venu Goapl Reddy
Author- NTV Telugu-
Wife kills Husband: భర్త మరణించిన నెలలోపే మరో పెళ్లి.. అప్పుడే అసలు నిజం తెలిసింది..
Wife kills Husband: భర్తల్ని ప్రియుడితో కలిసి చంపుతున్న భార్యలు. ఇలాంటి మరో సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రారంభంలో గుండెపోటుతో మరణించాడని అంతా భావించినప్పటికీ, నెల రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని దాదాపు నెల తర్వాత వెలికి తీసిన తర్వాత, గొంతు నొక్కేయడం వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
Bengaluru Shocker: భార్య ప్రాణం తీసిన ‘‘సాంబార్’’ గొడవ..
Bengaluru Shocker: చిన్న చిన్న కారణాలే కుటుంబాల్లో కల్లోలాలు రేపుతున్నాయి. మనస్పర్థలతో ఆత్మహత్యలు, హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న ఘటన భార్య ఆత్మహత్యకు కారణమైంది. 3 రోజుల క్రితం నాటి ‘‘సాంబార్’’ను పదే పదే వడ్డించడంపై జరిగిన వివాదంలో 27 ఏళ్ల మహిళ మృతి చెందింది. -
Donald Trump: ఇరాన్ కోసం ట్రంప్ MIGA నినాదం.. లొంగిపోవాలని వార్నింగ్..
Donald Trump: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కీలక హెచ్చరిక చేశారు. ఇరాన్ ‘‘బేషరతుగా’’ లొంగిపోతేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోకపోతే ఒప్పందం లేదని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోయే వరకు, దౌత్యమార్గం లేదని అన్నారు. -
ICC T20 World Cup: “మహ్మద్ అమీర్ కన్నా ఊసరవెళ్లి నయం”.. భారత్ విజయంతో మాట మార్పు..
ICC T20 World Cup: టీ20 ప్రపంచ కప్లో భారత్ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. అయితే, భారత్ సెమీస్లో గెలవదు, అసలు సెమీస్కే చేరదు అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ అవాకులు చెవాకులు పెలాడు. భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ప్రస్తుతం భారత్ ఫైనల్స్కు చేరడంతో మాట మార్చాడు. సోషల్ మీడియాలో అమీర్పై నెటిజన్లు తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. […] -
Iran War: ఇరాన్ యుద్ధం.. భారత బాస్మతి వ్యాపారంపై దెబ్బ..
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి. -
Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
Pakistan: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్లో కంగారు పెట్టిస్తోంది. తోటి ముస్లిం దేశమైన ఇరాన్ కు మద్దతు ఇవ్వాలో లేదో తేల్చుకోని పరిస్థితుల్లో ఆ దేశ నాయకత్వం ఉంది. మరోవైపు, ఇరాన్పై దాడుల్ని పాకిస్తాన్ ప్రజలు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ పార్లమెంట్లో గొడవకు కారణమైందని అక్కడి రాజకీయ నాయకులు చెప్పారు. -
Iran Israel War: యుద్ధంలోకి రష్యా ఎంట్రీ.. అమెరికా సంచలన ఆరోపణ..
Iran Israel War: ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్పై భారీ దాడులు చేస్తున్నాయి. గత శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని చమురు సౌకర్యాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. Read Also: T20 World Cup […] -
LPG Production: LPG ఉత్పత్తిని పెంచండి.. ఇంధన సంస్థలకు కేంద్రం ఆదేశాలు..!
LPG Production: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రంగ సంక్షోభానికి కారణం కాబోతోంది. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్, LPG వంటి పెట్రోలియం నిల్వలు ప్రస్తుతం దేశంలో సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
Israel Iran War: యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదు.. గల్ఫ్ దేశం వార్నింగ్..
Israel Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. కువైట్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ ఘర్షణ ప్రారంభమై వారం గడుస్తోంది. ప్రతీ రోజూ కూడా అమాయకులు చనిపోతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు సంక్షోభం […] -
Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న పైలట్ మృతి..
Sukhoi Crash: గురువారం అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్లో భారత వైమానిక దళం సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరణించిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఉన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’లో దురాగ్కర్ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో భారత వైమానికదళం అత్యుత్తమ పైలట్ను కోల్పోయింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్నే మించిపోయాడు.. ఐపీఎల్లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!
-
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్సింగ్ అక్కడ కూడా ఫ్లాపేనా?
-
Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్
-
Mahesh Babu: రాజమౌళి మహేశ్కు పాస్పోర్ట్ ఇచ్చేశాడా?
-
RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా నయా హిస్టరీ..
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!