ప్రజలను లంచాల కోసం రాబందుల్లా పీక్కుని తింటున్నారు కొంత మంది అధికారులు. ఏ పని చేయాలన్నా చేయి తడవనిదే ప్రారంభించడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేటు అంటూ లంచాలు వసూలు చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు. అయితే తాజాగా తనను లంచం కోసం వేధించిన ఇద్దరు ఉద్యోగాలను పట్టించాడు ఓ వ్యక్తి. సనత్ నగర్ విద్యుత్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు ఏసీబీ రైడ్స్ లో చిక్కారు. విద్యుత్ కార్యాలయంలో 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు […]
తెలంగాణ పంటలపై కీలక కామెంట్లు చేశారు మంత్రి హరీష్ రావు. ఇదే విధంగ మోటర్లకు మీటర్లు పెట్టాలనుకున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 5 ఏళ్లలో అత్యధికి పంటలు పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఆకలి చావులు, కాలిపోయే మోటార్లు, గుక్కెడు నీళ్లు లేకుపోయేవని ఆయన అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. రైతు బీమా పథకంల దేశంలో ఏ రాష్ట్రం కూడా […]
తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న శక్తులు ఇంకా తెలంగాణలోనే ఉన్నాయన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ శక్తులే తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అన్నారు. దేశంలో 58 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. డబ్బను పుట్టించడం మళ్లీ ఆ డబ్బును ఖర్చు అయ్యేలా చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మెరగుపడుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం ద్వారానే ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారని అన్నారు. రూ. 2 కిలో బియ్యం […]
పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా దారుణంగా చంపేశారు. ఈ రోజు పెద్ద ఎత్తున్న ప్రజల మధ్య ఆయన అంతిమ సంస్కాారాలు పూర్తయ్యాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కీలక నిజాలు బయటపడ్డాయి. సిద్దూ శరీరంలో 24 బుల్లెట్ గాయాలు కనిపించాయని వైద్యులు వెల్లడించారు. కాళ్లు, పొట్ట, తలలో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. బుల్లెట్లు సిద్దూ శరీరాన్ని ఛిద్రం చేశాయి. సిద్దూ లివర్ లో బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఐదుగురు డాక్టర్ల టీం సిద్దూకు […]
దేశ రాజధానిని వడగళ్ల వాన కుదిపేసింది. భారీ గాలి, వడగళ్లతో దేశ రాజధానిని అతలాకుతలం చేసింది. భారీ గాలులులతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. గాలి వాన భీభత్సానికి పలువురు మరణించారు. చాలా చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. 2018 తర్వాత వచ్చిన చాలా ప్రభావంతో వచ్చిన వర్షంగా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో […]
ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు […]
ప్రపంచ అగ్రనేత, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇంకో మూడేళ్లే బతుకుతాడా..? ఇంటెలిజెన్స్ అధికారులు, గూడాచారులు రిపోర్ట్ ఆధారంగా మూడేళ్లకు మించి పుతిన్ బతకరని తెలుస్తోంది. తాజాగా పుతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ ఒక నివేదికలో తెలియజేసింది. అతను మూడేళ్లు మించి జీవించి ఉండరని మాజీ రష్యా ఇంటెలిజెన్స్ అధికారి చెప్పినట్లు ఇండిపెండెంట్ ఒక కథనంలో తెలిపింది. పుతిన్ తీవ్రమైన కాన్సర్ తో బాధపడుతున్నట్లు దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడిచింది. రష్యన్ ఫెడరల్ […]
మనీలాండరింగ్ , హవాలా కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దూకుడు పెంచింది. కోల్ కతాకు చెందిన కంపెనీకి హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై ఆప్ పార్టీ భగ్గుమంది. కేంద్రం కావాలనే విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కావాలనే మా పార్టీకి చెందిన మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. […]
మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం, […]
మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు […]