Madhya Pradesh: గెలిచింది భార్యలు.. ప్రమాణస్వీకారం చేసింది భర్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husbands Replace Elected Wives At Panchayat Oath Ceremony: మహిళా సాధికారత అనేది రాజకీయాల్లో ఇప్పటికీ సాధ్యపడటం లేదు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇప్పటికీ భార్యలు గెలిచినా.. పెత్తనం అంతా భర్తలదే. తమకు రిజర్వేషన్ అనుకూలించకపోతే తల్లులను, భార్యలను నిలబెడుతున్నారు రాజకీయ నాయకులు. అధికారుల మీటింగుల దగ్గర నుంచి, అభివృద్ధి పనుల సమీక్ష వరకు అన్ని వీరే చేస్తుంటారు. ఎన్నికల్లో గెలిచినా మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారు. సాధారణంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే భార్యలు అన్న రీతిలో పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళ పరిస్థితి నెలకొంది. తాజాగా భార్యల తరుపున స్వయంగా ప్రమాణస్వీకారాలు చేసే పరిస్థితి కూడా నెలకొంది.
Read Also: Mother Cruelty: కసాయి తల్లి.. నాలుగో అంతస్థు నుంచి కూతుర్ని పడేసింది
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
ఇటీవల మధ్య ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే తాజాగా దమోహ్ జిల్లాలోని ఓ గ్రామపంచాయతీలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ స్థానంలో ఆమె భర్త ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాజకీయాల్లో మహిళల పాత్రను పరిమితం చేసే ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీ పరిధిలో షెడ్యూల్ తరగతికి చెందిన ఓ మహిళ సర్పంచుగా గెలుపొందింది. మరికొంతమంది మహిళలు కూడా విజయం సాధించారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో మహిళలకు బదులుగా అంతా భర్తలే హాజరయ్యారు. అయితే భార్యల స్థానంలో భర్తలే ప్రమాణస్వీకారం చేయడానికి అధికారులే అనుమతించారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ సీరియస్ అయింది. వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. దామోహ్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోందని.. విషయాన్ని పూర్తిగా విచారణ చేసి పంచాయతీ కార్యదర్శి దోషిగా తేలితే శిక్షిస్తామని అన్నారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!