Kachanatham Case: తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivaganga Court Sentences 27 People To Life Imprisonment: తమిళనాడులో 2018లో కొంత మంది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తుల అహంకారానికి ముగ్గురు షెడ్యూల్ కులాల వ్యక్తులు బలయ్యారు. కాచనాథం ట్రిపుల్ మర్డర్ కేసుగా దేశంలో అప్పట్లో సంచలన సృష్టించింది. తాజాగా ఆ కేసులో శివగంగ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2018 లో తమిళనాడు శివగంగ జిల్లా కచనాథమ్ లో ముగ్గురు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులను చంపిన నేరం కింద 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. అగ్రకులానికి చెందిన నలుగురు బాలనేరస్థులతో పాటు మొత్తం 33 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రత్యేక న్యాయమూర్తి జి. ముత్తుకుమరన్ దోషులను నిర్థారిస్తూ శిక్షను ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం బుధవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు విచారణలో ఇప్పటికే ఒకరు మరణించగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
2018 మే 28న కాచనాథంలో ఆలయ మర్యాదల విషయంలో గొడవ చెలరేగింది. ఆలయ మర్యాద విషయంలో అగ్రకులస్తులను, షెడ్యూల్ కులస్తులు నిలదీయడంతో ఈ దాడి జరిగింది. తమను ప్రశ్నించారనే నెపంతో ఆగ్రహంతో అహం దెబ్బతిన్న అగ్ర కులస్తులు.. షెడ్యూల్ కులానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. మే 28, 2018 రోజున గ్రామంలో కరెంట్ కట్ చేసి ఇళ్లలోకి చొరబడిన వ్యక్తులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కే. అరుముగం, ఏ. షణ్ముగనాథణ్, వి. చంద్ర శేఖర్ అనే ముగ్గురు వ్యక్తుల మరణించారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ కేసులో నలుగురు బాలనేరస్థులతో పాటు 33 మంది నిందితులుగా ఉన్నారు. ఆగస్టు 1న, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దోషులు, బాధిత కుటుంబసభ్యుల వాదనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్నారు. అంతకుముందు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు కూడా కామెంట్స్ చేసింది. దోషులు చేసుకున్న అప్పీళ్లను కొట్టేసింది. అగ్రకులాలు చేసిన క్రూరత్వం సమాజంలో శాంతి, ప్రశాంతతలపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!