Kachanatham Case: తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sivaganga Court Sentences 27 People To Life Imprisonment: తమిళనాడులో 2018లో కొంత మంది అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తుల అహంకారానికి ముగ్గురు షెడ్యూల్ కులాల వ్యక్తులు బలయ్యారు. కాచనాథం ట్రిపుల్ మర్డర్ కేసుగా దేశంలో అప్పట్లో సంచలన సృష్టించింది. తాజాగా ఆ కేసులో శివగంగ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. 2018 లో తమిళనాడు శివగంగ జిల్లా కచనాథమ్ లో ముగ్గురు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వ్యక్తులను చంపిన నేరం కింద 27 మందికి జీవిత ఖైదు శిక్ష విధించింది ప్రత్యేక కోర్టు. అగ్రకులానికి చెందిన నలుగురు బాలనేరస్థులతో పాటు మొత్తం 33 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రత్యేక న్యాయమూర్తి జి. ముత్తుకుమరన్ దోషులను నిర్థారిస్తూ శిక్షను ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం బుధవారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు విచారణలో ఇప్పటికే ఒకరు మరణించగా.. మరొకరు పరారీలో ఉన్నారు.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
2018 మే 28న కాచనాథంలో ఆలయ మర్యాదల విషయంలో గొడవ చెలరేగింది. ఆలయ మర్యాద విషయంలో అగ్రకులస్తులను, షెడ్యూల్ కులస్తులు నిలదీయడంతో ఈ దాడి జరిగింది. తమను ప్రశ్నించారనే నెపంతో ఆగ్రహంతో అహం దెబ్బతిన్న అగ్ర కులస్తులు.. షెడ్యూల్ కులానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. మే 28, 2018 రోజున గ్రామంలో కరెంట్ కట్ చేసి ఇళ్లలోకి చొరబడిన వ్యక్తులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కే. అరుముగం, ఏ. షణ్ముగనాథణ్, వి. చంద్ర శేఖర్ అనే ముగ్గురు వ్యక్తుల మరణించారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు. ఈ కేసులో నలుగురు బాలనేరస్థులతో పాటు 33 మంది నిందితులుగా ఉన్నారు. ఆగస్టు 1న, ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి దోషులు, బాధిత కుటుంబసభ్యుల వాదనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్నారు. అంతకుముందు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు కూడా కామెంట్స్ చేసింది. దోషులు చేసుకున్న అప్పీళ్లను కొట్టేసింది. అగ్రకులాలు చేసిన క్రూరత్వం సమాజంలో శాంతి, ప్రశాంతతలపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..