-
Hyderabad: మలక్ పేటలో కాల్పుల కలకలం.. వాకింగ్ చేస్తున్న వారిపై కాల్పులు
మలక్ పేటలోని శాలివాహన నగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన వారిపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. చందు నాయక్ అనే వ్యక్తి పై కాల్పులు జరిపారు గుర్తు తెలియాలని వ్యక్తులు.. అతను స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చం పేట వాసి. కాల్పులకు కారణం భూ వివాదం అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. వాకర్స్ పై కాల్పులు జరపడంతో ప్రాణ భయంతో పరుగులు తీసిన […] -
AUS vs WI: స్టార్క్-బోలాండ్ విధ్వంసం.. 27 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్
జమైకాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్ను రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసి 3-0 తేడాతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 14.3 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. 7.3 ఓవర్లలో 4 మెయిడెన్లతో 9 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. 1955 తర్వాత వెస్టిండీస్లో ఒక ఆస్ట్రేలియన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. […] -
Gautam Gambhir: గంబీర్ రిపోర్ట్ కార్డ్.. టీం ఇండియా హెడ్ కోచ్ నుంచి తొలగించే అవకాశం!
శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు చారిత్రాత్మక మైదానం లార్డ్స్లో ఆతిథ్య ఇంగ్లాండ్ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. కానీ ఓటమిపాలైంది. ఈ ఓటమి తర్వాత, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలోని టెస్ట్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో మూడో టెస్ట్లో ఓటమితో, ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ను కోల్పోయే ప్రమాదం భారత జట్టుపై పొంచి ఉంది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో […] -
Congress: మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీ అనుమానాస్పద మృతి
కొల్చారం (మం) వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్- జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్(45) మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Promotions […] -
Yamaha FZ-X Hybrid: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా?.. యమహా FZ-X హైబ్రిడ్ విడుదల.. ఈ బైక్ పై ఓ లుక్కేయండి
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ యమహా దేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ బైక్ యమహా FZ-S Fi హైబ్రిడ్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన రెండవ హైబ్రిడ్ బైక్ను తీసుకువచ్చింది. యమహా FZ‑X హైబ్రిడ్ పేరిట రిలీజ్ చేసింది. హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీని దాని నియో-రెట్రో స్ట్రీట్ బైక్కు పరిచయం చేసింది. ధర రూ. 1,49,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కొత్త FZ-X కలర్ TFT మీటర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్తో సహా టెక్ అప్గ్రేడ్లతో వస్తుంది. […] -
Live-in Relationship: భార్యతో గొడవ పడుతుందని.. సహజీవనం చేస్తున్న మహిళపై ప్రియుడి దారుణం
పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు, సహజీవనాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన భార్యతో గొడవపడుతుందని తనతో సహజీవనం చేస్తున్న మహిళను అంతమొందించాడు ఓ ప్రియుడు. కొనిజర్ల మండలం విక్రమ్ నగర్ లో భార్యతో గొడవ పడుతుందని సహజీవనం చేస్తున్న మహిళను లక్ష రూపాయలు సుపారి ఇచ్చి ప్రియురాలిని హత్య చేయించాడు. Also Read:NBK : బి. సరోజా దేవి మృతి పట్ల బాలయ్య సంతాపం […] -
Bitcoin: రికార్డు బద్దలు కొట్టిన బిట్కాయిన్.. 5 నిమిషాల్లో రూ. 86,000 పెరిగి.. రూ.1.04 కోట్లకు చేరిక
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం ఐదు నిమిషాల్లోనే $1,000 (దాదాపు ₹86,000) పెరిగింది. సోమవారం $1,21,249.90 (₹1.04 కోట్లకు పైగా) వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. క్రిప్టోకరెన్సీ మొదటిసారిగా $116,000 (₹99.78 లక్షలు) దాటిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. గత మూడు నెలల్లో బిట్కాయిన్ దాదాపు $36,000 (₹31 లక్షలు) లేదా 42% కంటే ఎక్కువ పెరిగింది. ఈ బూమ్ ETFలలో (ఎక్స్ఛేంజ్ […] -
Andhra Mahila Sabha Hospital: ఆసుపత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం
హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ వార్డ్ బాయ్ మహిళా పేషెంట్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వార్డ్ బాయ్. అసభ్య ప్రవర్తనతో మహిళ పేషంట్ కేకలు వేసింది. మహిళా పేషంట్ అరుపులతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు […] -
Tejeshwar Case: నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు.. అన్నా నన్నెందుకు చంపుతున్నారు అని వేడుకున్నా..
గద్వాల నవ వరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం […] -
Gold Rates: పసిడి ధరలు పైపైకి.. నేడు తులం ఎంతంటే?
పసిడి ధరలు మరింత పైపైకి చేరుకుంటున్నాయి. నేడు తులం పసిడి ధర రూ. 170 పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,988, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,155 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150 పెరిగింది. దీంతో రూ.91,550 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!