PM Modi: గాల్వాన్ లోయ వివాదం తర్వాత.. తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
- గాల్వాన్ లోయ వివాదం తర్వాత
- తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
- షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై చర్చించే అవకాశం ఉంది.
Also Read:Mohammad Siraj: ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో సిరాజ్ మియాకు కెరీర్ బెస్ట్
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
దీని తర్వాత, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాంజిన్ నగరంలో జరగనున్న SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. 2019 తర్వాత ప్రధాని మోడీ చైనాకు ఇది తొలి పర్యటన అవుతుంది. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, వాణిజ్య సహకారం, బహుపాక్షిక సహకారం వంటి ముఖ్యమైన అంశాలపై SCO సమావేశంలో చర్చించనున్నారు.
Also Read:Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ సీరియస్
రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం బ్రిక్స్ దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో, బ్రిక్స్ దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఆరోపిస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఈ పర్యటన ఆసక్తిగా మారింది. ఈ పరిస్థితిలో, ప్రధాని మోడీ ఈ పర్యటన వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. జూన్ ప్రారంభంలో, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలోని కింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్లతో అనధికారిక సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
- Tags
- china
- Narendra Modi
- SCO
తాజావార్తలు
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్లైన్.. భారత్కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!