కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి పీయూష్ గోయల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగానికి అండగా నిలవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు పొందేలా ప్రయత్నాలు చేసి.. రైతులను ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్ర జీడీపీలో మత్స్య రంగం కీలకమైన భూమిక పోషిస్తుందని, ఆక్వా రైతులకు సంక్షోభ సమయంలో అండగా నిలవాలని కోరారు. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై అమెరికా […]
బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. అందుకే బెల్లాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల గ్యాస్, అజీర్ణం లేదా యాసిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం శరీరంలోని […]
MG మోటార్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 2025లో ఎంపిక చేసిన మోడళ్లపై కొనుగోలుదారులు రూ. 3.92 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. మోడల్ సంవత్సరం, వేరియంట్, లభ్యతను బట్టి ఆఫర్లు మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్షిప్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఏ మోడల్ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో ఇప్పుడు చూద్దాం. Also Read:Allu Arjun : బన్నీ – అట్లీ మూవీ.. నిర్మాణ సంస్థ […]
ఈ నెలలో మరికొన్ని రోజుల్లో మార్కెట్ లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.బడ్జెట్-ఫ్రెండ్లీ నుంచి హై-ఎండ్ హ్యాండ్సెట్ల వరకు ఈ ఫోన్లు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. రియల్మీ నార్జో 80x 6,000mAh బ్యాటరీతో వస్తుంది. వివో V50e కర్వ్డ్ డిస్ప్లేతో కెమెరా-ఫోకస్డ్ ఫోన్ అవుతుంది. బడ్జెట్ గేమర్స్ కోసం, iQOO Z10x కూడా త్వరలో ప్రారంభించబడుతుంది. రాబోయే అన్ని స్మార్ట్ఫోన్లలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి. […]
యూజర్లకు రిలయన్స్ జియో క్రేజీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. ఓటీటీ లవర్స్, క్రికెట్ ప్రియులకు మరింత కిక్కిచ్చేలా రెండ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఉచిత నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ను అందిస్తోంది. ఆ రెండు ప్లాన్లలో మొదటి ప్లాన్ ధర రూ. 1799 కాగా, రెండవ ప్లాన్ ధర రూ. 1299. ఈ ప్లాన్ల వివరాలు మీకోసం.. Also Read:PM Modi: […]
విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా యువతిపై హత్యాయత్నం కేసును పోలీసు ఛేదించారు. యువతి ఆఖిలపై కత్తితో దాడి చేసిన ఆదినారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:R. Krishnaiah: […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అవసరమైన ఇంజినీర్లను భర్తీచేసేందుకు చర్యలు చేపట్టింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఏఈ) నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 390 పోస్టులను భర్తీచేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ నియమించుకోనుంది. Also Read:Waqf […]
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 7వ తేదీ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి […]
పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Also Read:Bengaluru: […]
కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పిల్లిబోయిన బ్యూలా ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో ఆత్మహత్య కు ఓ యువకుడి ప్రేమ వేధింపులే కారణంగా పోలీసులు తేల్చారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ […]