అసాంఘిక కార్యాకలాపాలకు శ్మశాన వాటికను అడ్డాగా మార్చుకుంది ఓ మహిళ. శ్మశానంలోని గదిలో వ్యభిచార దందా నడుపుతోంది. గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తోంది. శ్మశానంలో అయితే ఎవరికీ అనుమానం కలుగదని భావించింది. కానీ తప్పు చేసిన వాళ్లు ఏదో ఒక రోజు పట్టుబడాల్సిందే కదా.. ఈ క్రమంలో విషయం తెలిసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనఖీలు చేసి గుట్టురట్టు చేశారు. ఈ ఘటన పంజాగుట్టలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పరిధిలోని శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చింది ఓ మహిళ. […]
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ […]
కూకట్ పల్లి పీఎస్ పరిధిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. పోలీసులు టెక్నికల్, ఇతర ఏవిడెన్స్ ఆధారంగా నిందితుల జాడ కనుగొని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా […]
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రాణ నష్టం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందో ఇంకా […]
బ్యాంకులో దొంగలు పడ్డారు.. కానీ బయటి వాళ్లు కాదు.. బ్యాంకు సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చెన్నూర్ ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంకు లో 402 మంది తాకట్టు పెట్టిన బంగారాన్ని క్యాషియర్ తస్కరించిన విషయం తెలిసిందే. ఆ మోసం మరవక ముందే మరో మోసం వెలుగు చూసింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ లో ఎస్ బీ ఐ బ్యాంకు లో నాణ్యత లేని బంగారం తాకట్టు పెట్టి మొత్తం 12 మంది […]
మణిపూర్లో జాతి హింస చెలరేగిన 862 రోజుల తర్వాత, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటనకు వెళ్తున్నారు. 2023 హింస తర్వాత ఆయన తొలిసారి మణిపూర్ లో పర్యటిస్తున్నారు. మణిపూర్ ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 13న ప్రధాని మోడీ మణిపూర్ కు చేరుకుని రూ.8500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ప్రకటించారు. ప్రధాని మోడీ ముందుగా చురచంద్పూర్ వెళ్లి, అక్కడ జిల్లాలోని కొంతమంది నిరాశ్రయులైన ప్రజలను కలుస్తారని తెలిపారు. […]
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. తెలంగాణలోని 34 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ- EFLU మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విదేశాల్లో ఉద్యోగం కోసం జర్మన్, జపాన్ లాంగ్వేజ్ లలో నర్సింగ్ విద్యార్థులకు రెండేళ్ల శిక్షణ ఇవ్వనున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజిస్ యూనివర్సిటీ.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ పై […]
లంచగొండి అధికారులపై ఏసీబీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరి తీరు మారడం లేదు. డబ్బు సంపాదనే లక్ష్యంగా లంచాలకు చేతులు చాపుతున్నరు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు సేవలందించాల్సిందిపోయి లంచాలు ఇవ్వాలని పీడిస్తున్నారు. లంచాలు పుచ్చుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. తాజాగా మరో అధికారిని లంచం తీసుకుంటూ దొరికిపోయింది. నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. Also Read:Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా? ఈ సోదాల్లో […]
చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆదమరిచి ఉంటే అంతే సంగతులు. ఓ ముఠా పిల్లలే టార్గెట్ గా నగరంలో సంచరిస్తోంది. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఓ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో వాచ్మెన్ పిల్లలను టార్గెట్ చేసుకోనీ ఎత్తుకెళ్లేందుకు రెడీ అయ్యింది ముఠా. అప్రమత్తమైన స్థానికులు ముఠాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పిల్లలను అపహరించే గ్యాంగుకు దేహశుద్ధి చేశారు. కాగా ముటా సభ్యులలో ముగ్గురిలో ఇద్దరు ఆటోలో తప్పించుకోగా ఒకరు పట్టుబడ్డారు. పట్టుకున్న మహిళను స్తంభానికి కట్టేసి కొట్టి […]