బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఊహకందని రీతిలో రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. గోల్డ్, వెండి ధరల పెరుగుదల ఆగే సూచనలు కనిపించడం లేదు. భవిష్యత్తులో కూడా ఈ పెరుగుదల కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ సాచ్స్ రాబోయే కాలంలో బంగారం ధరలు 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత, ఆర్థిక అనిశ్చితి. బంగారం మాత్రమే కాదు, వెండి కూడా ప్రతిరోజూ […]
పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, CAPFలో 3,073 సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు వేతనం అందుకోవచ్చు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లోని మొత్తం ఖాళీలలో 10 శాతం మాజీ సైనికులకు రిజర్వ్ చేశారు. ఢిల్లీ పోలీస్లో మొత్తం 212 ఖాళీలలో 142 పురుషులకు, 70 […]
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీలు ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారు కైనెటిక్ ఇ-లూనా ప్రైమ్ను ప్రారంభించింది. కైనెటిక్ గ్రీన్ మార్కెట్లో ఇ-లూనా ప్రైమ్ను విడుదల చేసింది. తయారీదారు ఈ మోపెడ్ను విస్తృత శ్రేణి ఫీచర్లతో అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఇ-లూనా ప్రైమ్ వినియోగదారులకు […]
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన 5 సంవత్సరాల బాలుడు మనీష్ కుమార్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొడుకును హత్య చేసింది తల్లే అని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కన్న కొడుకులను తల్లే చంపడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపేందర్ – శిరీష దంపతులు ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు.. మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. భర్త ఉపేందర్ క్యాబ్ […]
డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నియమాలను జారీ చేసింది. టెక్స్ట్ సందేశం ద్వారా స్వీకరించే వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)తో పాటు, వినియోగదారులకు ఇప్పుడు రెండు-కారకాల అథెంటికేషన్ కోసం మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొత్త RBI నియమాలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. కొత్త నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, షాపింగ్ యాప్కు చెల్లించినా లేదా స్నేహితుడికి డబ్బు పంపినా, ప్రతి లావాదేవీకి రెండు-కారకాల అథెంటికేషన్ […]
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే కొందరు పురుషులు, మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. భార్య కూర సరిగా వండకున్న గొడవలే.. భర్త తన వంటను మెచ్చుకోకున్నా వివాదమే.. ఇలా టీ కప్పులో తుఫానులాగా భార్యా భర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. తాజాగా యూపీలోని తిల్హార్లోని ప్రహ్లాద్పూర్ గ్రామంలో ఓ గర్భిణీ స్త్రీ భర్త తనతో కలిసి అన్నం తినడానికి నిరాకరించాడని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పాయిజన్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. […]
హోండా కంపెనీ బైకులకు మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. క్వాలిటీ, ఫీచర్లు వాహనదారులను అట్రాక్ట్ చేస్తుంటాయి. తాజాగా హోండా మోటార్ హోండా CB350C ప్రత్యేక ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంజిన్లో ఎటువంటి మార్పులు చేయలేదు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. స్పెషల్ ఎడిషన్ మోటార్ సైకిల్ లో స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్లు, వివిధ భాగాలపై కొత్త చారల గ్రాఫిక్స్ ఉన్నాయి. వెనుక గ్రాబ్ రైల్ కూడా క్రోమ్-ఫినిష్ చేయబడింది. సీటు […]
ఏసర్ గ్రూప్ కంపెనీ ఏసర్ప్యూర్ ఇండియా వివిధ రకాల గేమింగ్ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఏసర్ తాజా స్మార్ట్ టీవీ నైట్రో సిరీస్ గేమింగ్ టీవీని కంపెనీ నాలుగు స్క్రీన్ సైజులలో విడుదల చేసింది. 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు. ఏసర్ తాజా టీవీలు ఉత్తమ గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ను కలిగి ఉన్నాయి. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి టీవీలో యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తాజా నైట్రో సిరీస్ గేమింగ్ టీవీలు ఫ్లిప్కార్ట్ నుండి […]
అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుం పరే జిల్లాకు చేరుకున్నారు. అక్కడ మహిళా సివిల్ సర్వీస్ అధికారిణి విశాఖ యాదవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ అధికారిణి, మోడీని పలకరిస్తున్న ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్స్ ఎవరీ విశాఖ యాదవ్ అంటూ తెగ వెతికేస్తున్నారు. విశాఖ యాదవ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్గా […]
ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. లక్ష కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో బ్లాక్ బస్టర్ డీల్ అందుబాటులో ఉంది. గత సంవత్సరం విడుదలైన ప్రీమియం ఫ్లాగ్షిప్, వివో X100 ప్రో, ప్రస్తుతం అమెజాన్లో రూ. 27,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 89,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ. 63,000 కంటే […]