Mother: ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ముగ్గురు కొడుకులు.. భర్త అలా చేస్తుండడంతో ఇద్దరు కుమారులను చంపిన తల్లి
- ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్
- ముగ్గురు కొడుకులు
- ఇద్దరు కుమారులను చంపిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జరిగిన 5 సంవత్సరాల బాలుడు మనీష్ కుమార్ హత్య కేసును పోలీసులు చేధించారు. కొడుకును హత్య చేసింది తల్లే అని నిర్ధారించి అరెస్ట్ చేశారు. కన్న కొడుకులను తల్లే చంపడంతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపేందర్ – శిరీష దంపతులు ఆరేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు.. మనీష్, మొక్షిత్, నీహల్ ఉన్నారు. భర్త ఉపేందర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే కొంత కాలం నుంచి తన భర్త అక్రమ సంబంధాలు అంటగడుతూ వేధిస్తున్నాడని భార్య శిరీష పోలీసు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
పిల్లలను కూడా దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాడని మానసికంగా కుమిలిపోయినట్లు వెల్లడించారు. భర్త తాగుడుకు బానిసై భార్యను పిల్లలను పట్టించుకోకపోవడంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే తాను చనిపోతే పిల్లలను పట్టించుకునే వారు లేరని భావించి వారిని చంపి తాను చనిపోవాలని అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 24 వ తేదీ న మనీష్ కుమార్ ను నైలాన్ తాడు తో మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి తల్లి శిరీష చింపేసినట్లు పోలీసులు తెలిపారు. గత నెల రోజుల క్రితం ఈ బాలుడి పై హత్యాయత్నం చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read:Farmer Suicide: “నా పిల్లల చదువు బాధ్యత సీఎం తీసుకోవాలి..” లేఖ రాసి రైతు ఆత్మహత్య..
అంతకు ముందు 15 జనవరి 2025 న చిన్న కుమారుడు నిహాల్ (2 ) నీటి సంపు లో పడేసి చంపినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండవ కుమారుడు ప్రాణాలతో ఉన్నట్లు తెలిపారు. కసాయి తల్లి శిరీష ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా పిల్లలు వరుసగా చనిపోతుండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల పనేనని కుటుంబసభ్యులు భావించారు. చివరకు కన్న తల్లే పిల్లలను చంపిందన్న నిజం తెలిసి షాక్ కు గురయ్యారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల వరుస మరణాలతో కుటుంభికులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శిరీషను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!