విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.
దాడి వెనుక సీఎం జగన్ను చంపాలని ఉద్దేశ్యం ఉందని నిందితుడు సతీష్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు.. సీఎం జగన్ ను అంతం చేయాలని సున్నితమైన తల భాగంలో దాడి చేశారు.. రాత్రి 8 గంటల 4 నిమిషాలకు బస్సు యాత్రలో వివేకానంద స్కూల్ దగ్గరకు జనంతో కలిసి నిందితుడు చేరారు.. దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ మీద నుంచి తీసుకొని వచ్చాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్యా చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు…