కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి […]
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త […]
హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఆయన… మొదటగా కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్తో సమావేశమయ్యారు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లో భేటీ అయ్యారు.. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం.. కాగా, ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే బస […]
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో భారత్ వణికిపోయింది… మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి.. ఫస్ట్ వేవ్లో అనారోగ్యసమస్యలతో ఉన్నవారు ఇబ్బంది పడితే, సెకండ్ వేవ్లో యువతను కూడా వదలలేదు మహమ్మారి.. ఇక, థర్డ్ వేవ్లో చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.. అయితే, థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని చెప్పలేమని.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లోనూ చాలా మంది చిన్నారులకు కోవిడ్ బారినపడ్డారని […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్చాట్లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం […]
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై భారీగా నమోదయ్యాయి… అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు సమర్పిస్తామని చెబుతున్నారు.. ఈ ఉల్లంఘనలు ఎక్కువగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.. ఇక, ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు అయినట్టు […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ హస్తినకు వెళ్లారు.. మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు.. ఇక, రాత్రికి అక్కడే బస చేసే.. రేపు తిరిగి ఏపీకి రానున్నారు.. ఇదే సమయంలో.. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రతిపక్షాలకు అత్యుత్సాహం ఎక్కువ అవుతోందని మండిపడ్డ ఆయన.. సీఎం టూర్ పై వక్రభాష్యాలు చెప్పడం దురదృష్టకరం అన్నారు.. […]
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపికే.. విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.. త్వరలోనే విశాఖ నుంచే పాలన.. లాంటి స్టేట్మెంట్లు అధికార పక్షం నుంచి వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ ఎపిసోడ్పై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ… ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజధానుల వికేంద్రీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రోజు నుంచే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.. సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని మూడు […]
సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కాంలో సూత్రధారి మహమ్మద్ మన్సూర్ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ.. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. గత ఏడాది జూలై 5న త్రివేండ్రం ఎయిర్ పోర్ట్లో 30 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోగా.. దుబాయ్ నుండి మహమ్మద్ మన్సూర్ మొత్తం స్కాంను నడిపినట్లు గుర్తించారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్ లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశాడు మన్సూర్.. తిరువనంతపురoలో ఉన్న యూఏఈ కన్సులెట్ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్ […]