-
వ్యాక్సినేషన్ డ్రైవ్… ఇండియా రికార్డు
వ్యాక్సినేషన్ డ్రైవ్లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు […] -
ఇందిరాగాంధీ స్ఫూర్తితో గజ్వేల్లో దండోరా.. సర్వాధికారాలు గీతక్కకే..
ఇందిరా గాంధీ స్ఫూర్తితో గజ్వేల్లో దండోరా సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… గాంధీ భవన్లో జరిగిన పీపీసీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. గజ్వేల్ సభకి సర్వాధికారాలు గీతక్క(గీతారెడ్డి)కే ఉంటాయని.. ప్రతీ గ్రామంలో దండు కట్టి… దండోరా మోగించాలన్నారు. ఇక, గజ్వేల్ సభతో అంతకం కాదన్నారు రేవంత్ రెడ్డి.. గజ్వేల్ కోటను కొల్ల గొడితేనె.. సోనియమ్మ రాజ్యం వస్తుందన్నారు.. కో-ఆర్డినేటర్లు కష్టపడండి.. కష్టపడిన వారికే పదవులు, గుర్తింపు వస్తాయన్నారు. గజ్వేల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని […] -
తెలంగాణ కోవిడ్ అప్డేట్
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,974 శాంపిల్స్ పరీక్షించగా 315 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఒకేరోజు 318 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన టెస్ట్ల సంఖ్య 2,55,03,276కు చేరగా.. పాజిటివ్ కేసులు 6,61,866కు పెరిగాయి.. […] -
జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
గాంధీభవన్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమన్న ఆయన.. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి.. ఇక, అడుగడుగున పిలిస్తే నేను రాలేదు అని అనుకోకండి.. మీరు ఏదైనా […] -
ఇలా చేయండి.. వాట్సప్లో ఇక టైప్ చేయాల్సిన అవసరమే లేదు..!
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే.. […] -
సంజయ్ది తెలంగాణ వంచన యాత్ర.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం..!
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర […] -
కేసీఆర్ పాలన పోవాలి-ఛత్తీస్గఢ్ మాజీ సీఎం పిలుపు
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్ […] -
కేసీఆర్ పాలనలో ప్రజలకు అన్యాయం.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలె..
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు […] -
న్యాయవ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసు.. సీబీఐ మరో ఛార్జిషీట్
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా […] -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
గుజరాత్ సర్కార్లో వేగంగా పరిణామాలు మరిపోయాయి.. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ.. ఆ తర్వాత తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు.. ఇక, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మొత్తంగా గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు 59 ఏళ్ల భూపేంద్ర పటేల్.. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ఆచార్య దేవ్ వరాత్.. భూపేంద్ర పటేల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నిన్న సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్రను ఏకగ్రీవంగా […]
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!