వ్యాక్సినేషన్ డ్రైవ్లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాలు… వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి.