ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయానా.... కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారలేదట. మేమింతే.... అడ్డొచ్చేదెవడహే....అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. డైరెక్ట్గా డీలర్ల నుంచే ఎత్తేసి డంప్ చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలనే లెక్కలన్నీ ఒకటో తేదీ నుంచే తయారు అయిపోతున్నాయట.
మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం వచ్చింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏకాభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎలా అమలుచేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నా.. అమలు చేయాల్సిందే అనే క్లారిటీ అయితే పూర్తిగా కనిపిస్తోంది.
వంగవీటి మోహన రంగా... ఆయన భౌతికంగా దూరమై దశాబ్దాలు గడుస్తున్నా... ఆ పేరు మాత్రం ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చినప్పుడైతే... రకరకాల ఈక్వేషన్స్ వంగవీటి చుట్టూనే తిరుగుతుంటాయి. కులాలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నా... ప్రత్యేకించి కాపులు మాత్రం ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో పొలిటికల్ హంగామా కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది.
పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు గ్రామంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్.. అయితే, ఉపాధ్యాయుడిగా మారారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పీటీఎం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యా బోధన చేశారు.. వనరుల అనే సబ్జెక్ట్ పై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.. అయితే, విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు మంత్రి నారా లోకేష్..
కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్టర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు.. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. విద్యార్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి లోకేష్.. కలిసికట్టుగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మృతిచెందారు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్దనున్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కమల్ భాష (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందగా.. మరో ఆరుగురుకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది..