మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు కీలక పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం అవుతుంది. డబ్ల్యూపీఎల్ 2025లో ఇప్పటికే గుజరాత్పై రెండుసార్లు గెలిచిన ముంబై.. ఎలిమినేటర్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అంతేకాదు సొంతగడ్డపై ఆడుతుండడం కూడా ముంబైకి కలిసొచ్చే అంశం. హేలీ మాథ్యూస్, నాట్సీవర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్, అమేలియా కెర్, యాస్టికా భాటియా వంటి బ్యాటర్లతో […]
కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత […]
ఎన్నో ఆశలు పెట్టుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకు వచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేశారని.. ఇప్పుడు పిల్లలు కాలేజీలు మానేసి పంట పొలాలకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై వైసీపీ పోరు కొనసాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాలన చేస్తోందని, దీనికి పర్యవసానం చెల్లించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు. మారుతి […]
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా.. మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్స్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతో […]
వాయిదా అనంతరం శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. ఛైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ను ఏర్పాటు చేశారు. మార్షల్స్ రక్షణలో సభ కాసేపు కొనసాగింది. మార్షల్స్ ఏర్పాటుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దుష్ట సంస్కృతి అని బొత్స పేర్కొన్నారు. ఇది పెద్దల సభ అని, ఇలా చేయడం సబబు కాదని ఛైర్మన్ బదులిచ్చారు. మీ సీట్లులో ఉండి నిరసన తెలుపుకోవచ్చని ఛైర్మన్ సూచించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా […]
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మెడ నొప్పి, నడుముల నెప్పి వల్లన కడప సెంట్రల్ జైలుకు పంపించాలని వర్రా కోరారు. అయితే జగ్గయ్యపేట సబ్ జైల్లో అవసరమైన ఏర్పాట్లు, చికిత్స అందించాలని పోలీసులకు మెజిస్ట్రేట్ తెలిపింది. మెజిస్ట్రేట్ ఆదేశాలకే జగ్గయ్యపేట సబ్ జైల్ అధికారులు ఓకే చెప్పారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు వర్రా రవీందర్ రెడ్డిని తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ […]
చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి.. మరో ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి పన్నాగం పన్నాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న ఏడుగురుతో ఒప్పందం కుదుర్చుకుని.. ప్లాన్ అమలు చేశాడు. డమ్మీ గన్నుతో బెదిరించి.. డబ్బు దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ప్లాన్ బెడసికొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరులో ఎస్ఎల్వీ ఫర్నిచర్ షోరూం యజమాని సుబ్రహ్మణ్యం అప్పుల పాలయ్యాడు. […]
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. […]
కన్నుమూసి తెరిచే లోపు ఏడాది గడిచిందని.. మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని.. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే.. తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుంది […]
సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి జైలు నుంచి బయటకు రావడంపై సందిగ్ధం నెలకొంది. కోర్ట్ బెయిల్ ఇచ్చినా.. బయటకు రావడం డౌటేనన్న అనుమానాలు నెలకొన్నాయి. పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసానిని కోర్టు గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట పోసానిని ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన […]