ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం మునగపాడులో ప్రేమజంట ఆత్మహత్య కి పాల్పడింది. జి.కొండూరు మండలం మునగపాడు కి చెందిన ఇల్లా వెంకటేశ్వర్లు ఇద్దరు మహిళల్ని పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య చందర్లపాడు మండలం ఏటూరు లో నివాసముంటుండగా, రెండవ భార్యతో మునగపాడు లో నివాసముంటున్నాడు వెంకటేశ్వర్లు. అయితే.. వెంకటేశ్వర్లు మొదటి భార్య కుమారుడి కొడుకు (వెంకటేశ్వర్లు మనవడు) ఇల్లా దుర్గాప్రసాద్(17), రెండవ భార్య చిన్న కూతురు(వెంకటేశ్వర్లు కుమార్తె) ఇల్లా పావని(18) మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలియడంతో […]
ఎన్ఆర్ఐ, భూస్వాములు, పెత్తందార్లకు టీడీపీ పార్టీ టిక్కెట్లు కేటాయించిందన్నారు ఎమ్మెల్యే శంకరనారాయణ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీడీపీ నాయకుల ప్రవర్తన ఉందన్నారు. మహిళ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా టీడీపీ నాయకుల చర్యలున్నాయన్నారు ఎమ్మెల్యే శంకరనారాయణ. టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టిన.. మహిళలు అంతా వ్తెసీపీ పక్షాన ఉన్నారన్నారు. కేశవ్ ఎన్ని జిమ్మికులు చేసిన వ్తెసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, నియోజకవర్గ ప్రాంత సమస్యలు పట్ల స్పందించిన దాఖాలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజుల […]
జేఎస్పీ, బీజేపీలతో సీట్ల పంపకం ఒక కొలిక్కి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేఎస్పీ, బీజేపీలకు 31 సీట్లు కేటాయించారు. ఇప్పటికే టీడీపీ తొలి జాబితాలో 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో టీడీపీ 30 అసెంబ్లీ, కొన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. జేఎస్పీ, బీజేపీ రెండూ తాము పోటీ చేసే స్థానాలపై […]
పిట్బుల్ సహా విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫారసు.. పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి […]
గంటా శ్రీనివాసరావు నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం పంపింది. అయితే.. నిన్న చంద్రబాబును కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్ చెప్పడంతో… చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో సమావేశం తర్వాత తుది […]
మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించింది. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య […]
నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఉదయం 10 గంటలకు కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. ఉదయం 11.30 గంటలకు బనగానపల్లెకు సీఎం జగన్. 100 పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్. తర్వాత అనంతపురం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 60,340 లుగా […]
పవన్ కళ్యాణ్ ను అమాయకుడిని చేసి కూటమిలో జనసేన సీట్లకు కోత పెట్టారని ఏపీ పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. బిజెపితో జతకట్టిన టిడిపి జనసేనలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఏమి సమాధానం చెప్తాయనీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కలవచర్లలో 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి […]
తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలు పైన […]
లోకసభ ఎన్నికలకు ఏఐసీసీ చీఫ్ దూరం?.. కారణం ఇదే..! కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది. కానీ ఖర్గే తన అల్లుడు రాధాకృష్ణన్ దొద్దమణిని గుల్బార్గా నుంచి ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నట్లు టాక్. అయితే, మల్లికార్జున్ ఖర్గే గుల్బార్గా నుంచి రెండు […]