నేడు తెలంగాణలో పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలునిచ్చింది. ప్రైవేటు స్కూల్స్లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల బంద్కు పిలుపునిస్తూ.. అందుకే హైదరాబాద్లోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నారు. బుధవారం పని చేయని రోజు అని పేర్కొంటూ హైదరాబాద్లోని పాఠశాలలు వాట్సాప్ సందేశాల ద్వారా తల్లిదండ్రులకు సెలవు నోటీసులు పంపాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపును అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనందుకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు జి జీవన్ డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలు విక్రయిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.