Murder : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తొడబుట్టిన వాళ్లనే కాటికి పంపుతున్నారు కొందరు దుర్మార్గులు. మెదక్ జిల్లాలో చేతబడులు చేస్తున్నాడని అనుమానంతో సొంత అన్ననే కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. కసి తీరా పీక కోసి కూల్ అయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు మంక్త్యా నాయక్, మోహన్ నాయక్. ఇద్దరు సొంత అన్నదమ్ములు.. సీన్ కట్ చేస్తే ఇగో ఇలా అన్న.. మంక్త్యా నాయక్ని తమ్ముడు మోహన్ అతి కిరాతకంగా బాండ రాళ్లతో […]
Ganja Batch : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. అర్ధరాత్రి నడిరోడ్డుపైనా అరాచకాలు సృష్టిస్తోంది. దాడులు చేయడం.. వీలైతే మర్డర్లు చేయడం గంజాయి బ్యాచ్కు పరిపాటిగా మారింది. మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా నేరాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ అటు విజయవాడలో జరిగిన రెండు ఘటనలు గంజాయి బ్యాచ్ ఆగడాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తిని గంజాయి గ్యాంగ్ కత్తులతో […]
HYD ROHINGYA : హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాలు ఎంత మంది? ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సరైన ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రోహింగ్యాలు స్థానికంగా ఉన్న గుర్తింపు కార్డులు పొంది మనలో కలిసిపోయారు. పైగా తామే లోకల్ అంటూ కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకుంటున్నారు. ఇంకా కొంత మంది రోహింగ్యాలైతే క్రైమ్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. వీరి వల్ల జాతీయ భద్రతే ప్రమాదంలో పడింది. యస్.. మీరు విన్నది కరెక్టే…!! బంగ్లాదేశ్, మయన్మార్ […]
Komatireddy Venkat Reddy : నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఓ ఉదంతం కలకలం రేపింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, సమయస్ఫూర్తితో స్పందించిన స్థానికులు అతడిని వెంటనే అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే టూ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. COVID-19: ‘‘స్ట్రాటస్’’ రూపంలో మళ్లీ తిరిగి వచ్చిన కోవిడ్-19.. పోలీసుల ద్వారా అతడి వివరాలు తెలియగా, […]
Shcoking Incident : మనుషుల మధ్య నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతున్న సమాజంలో, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాష్ట్ర రాయచూరు జిల్లా శక్తినగర్ మండలం కాడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నది […]
CJI Gavai : హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో 22వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ , నల్సార్ యూనివర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ సుజయ్ పాల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తన ప్రసంగంలో యువ […]
MLC Kavitha : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను టార్గెట్ చేసిన ఆమె, ఈ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్లే వ్యక్తిగా, రాష్ట్రానికి తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు అమ్మాయిలకు స్కూటీలు, పెళ్లికి లక్ష రూపాయల […]
MGM : ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహం మారిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడని భావించిన గోక కుమారస్వామి అనే వ్యక్తి, అసలు మృతుడే కాదని వరంగల్ పోలీసులు తాజాగా ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నారని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. చికిత్సలో ఉన్నపుడే, ఆయన మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఒక మృతదేహాన్ని తమ భర్తదని […]
WOW : ఈరోజుల్లో టెక్నాలజీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగమైపోయింది. కుటుంబం, స్నేహితులు కంటే ఎక్కువగా మనం మొబైల్, చాట్బాట్లతో కనెక్ట్ అవుతుంటాం. అలాంటి టెక్నాలజీలో ఒకటి .. చాట్జీపీటీ (ChatGPT). ఏ చిన్న సందేహం వచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా, మొదట గుర్తుకు వచ్చేది ఇదే. అయితే ఇటీవల, ఈ చాట్బాట్ ఓ అసాధారణమైన పని చేసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ పోస్ట్ ప్రకారం, గత 10 ఏళ్లుగా అనేక ఆరోగ్య […]
MGM : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డెడ్ బాడీ మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి బదులుగా మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50) మూడు రోజుల క్రితం అపస్మారక స్థితిలో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందాడు. ఆసుపత్రి అధికారులు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని […]