ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ ప్రపంచమే అబ్బుర పడే విధంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయ పనుల పురోగతిని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రీ,బేస్మెంట్ ఎలివేషన్, కోర్ట్ యార్డ్,జిఆర్సీ కాలమ్స్ క్లాడింగ్,కాంపొండ్ వాల్ అర్నమెంట్ గ్రిల్,ఫాల్ సీలింగ్,గ్రౌండ్ ఫ్లోర్ కారిడార్,గ్రానైట్స్ ఫ్లోరింగ్ డిజైన్,ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఎంట్రన్స్ లాబీ,ఆఫీసర్స్ ఛాంబర్స్,మంత్రుల ఛాంబర్స్ పనులు పరిశీలించారు.ఫ్లోర్ వైస్ పనుల పురోగతి పరిశీలించారు. బేస్మెంట్ ఎలివేషన్ కోసం వినియోగించే దూల్ పూర్ స్టోన్ మొత్తం 3వేల క్యూబిక్ మీటర్ల మేర పట్టనుండగా..రోజు 50 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున పూర్తయ్యేలా రోజుకు ఐదు లారీల లోడ్ స్టోన్ 60 రోజుల్లో తెప్పించి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీ ని ఆదేశించారు.
రాయి డిజైన్ పనుల కోసం మూడు షిఫ్టుల్లో నాలుగు టీములుగా ఏర్పడి పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. మెయిన్ ఎంట్రీ అర్నమెంట్ రెయిలింగ్ గ్రిల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. UPVC విండోస్ శాంపిల్స్ పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం పలు సూచనలు చేశారు. మెయిన్ గ్రాండ్ ఎంట్రన్స్ మెట్ల మార్గంలో వాడే రెయిలింగ్ డిజైన్ పరిశీలించి తగు సూచనలు చేసారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై అంతస్తు వరకు నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.