మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని […]
Former MLA Eravathri Anil Made Comments on Telangana Congress Leaders. కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశంపై గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ విప్ ఈరవర్తి అనిల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ రోజు రోజుకు రాష్ట్రంలో బలపడుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేసామంటే పార్టీ ఎంత బలంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునని, రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక పార్టీ ప్రజల్లోకి […]
సీనియర్ నేతల మీటింగ్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, ఈరవర్తి అనిల్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, ఇలాంటి తరుణంలో కొంతమంది వల్ల పార్టీ లోఇబ్బందికరంగా మారిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో విభజించు పాలించు లాగా చేస్తున్నారని, బ్రిటీష్ వాళ్ళు చేసిన పాలన లాగా చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి […]
కార్ల అద్దాలకు అమర్చే బ్లాక్ స్టిక్కర్లపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్ ఏరియాలో బ్లాక్ స్టిక్కర్స్ వేసుకొని వస్తున్న వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఎమ్మెల్యే, పోలీస్, ప్రెస్ స్టిక్కర్లతో పాటు బ్లాక్ గ్లాస్లతో తిరుగుతున్న వాహనాలపై చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బ్లాక్ స్టిక్కర్లను పోలీసులు తొలగిస్తున్నారు. జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. […]
తెలంగాణ కాంగ్రెస్లో ముసలం మొదలైనట్లు కనపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ లీడర్ మర్రి శశిధర్ రెడ్డి ఇంట్లో టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ దుమారం రేపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అసమ్మతితోనే పార్టీ సీనియర్లు సమావేశమయ్యారని వార్తలు వినిపించాయి. అయితే ఈ మీటింగ్ భట్టి లాంటి వారు స్పష్టతనిస్తూ.. అలాంటిదేమీ లేదని.. సోనియా, రాహుల్ గాంధీల సారథ్యంలోనే కాంగ్రెస్ నడిచేందుకు నిర్ణయం తీసుకున్నామని.. దానిపైనే సమావేశమయ్యామని […]
APCC Working President Narreddy Tulasi Reddy Fired on BJP. బీజేపీ రణభేరిపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఆయన మాట్లాడుతూ.. కడపలో బీజేపీ రణభేరి సభ పెట్టి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కడపలో బీజేపీ పార్టీ పెట్టిన సభ లాలూచీ, కుస్తీ సభ అని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ 5 ఏళ్ళు ప్రకటిస్తే దాన్ని బీజేపీ అమలు చేయలేదన్నారు. బీజేపీ […]
తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల సమావేశం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వమే కావాలంటూ సమావేశమైనట్లు ఇటీవల స్పష్టత ఇచ్చారు. అయితే నేడు మరోసారి టీకాంగ్రెస్ సీనియర్లు సమావేశం కానున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ చేసి సమావేశం నిర్వహించవద్దన్నారు. అంతేకాకుండా ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్ ల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీకి మేలు […]
Telangana Congress AICC Secretary N.S. Boseraju made Comments on T Congress Senior Leaders Meeting. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. సీనియర్లకు ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు ఫోన్ చేసి.. సమస్య ఉంటే.. నేరుగా సోనియా, రాహుల్కు చెప్పాలన్నారు. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొదని సూచించారు. అంతేకాకుండా సమావేశం రద్దు చేసుకోవాలని, సమావేశం ఏర్పాటు చేస్తే.. తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని ఆయన బోస్ రాజు అన్నారు. […]
Chicken Price Hike at Telugu States. చికెన్ ప్రియులకు ఇది చేదు వార్తే.. రోజురోజుకు చికెన్ ధరలు కొండెక్కుతున్నాయి. దీనితో నాన్ వెజ్ లేకుంటే ముద్దయిన దిగని వాళ్లకు చికెన్ కొనాలంటే జేబులు చిల్లవుతున్నాయి. విజయవాడలో కేజీ ధర రూ.306 చేరుకుంది. అలాగే హైదరాబాద్లో కూడా ఆరు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.281కు పెరిగింది. ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న ధర ఒక్కసారిగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ […]
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్లోని సీపీఎం కార్యాలయంలో ఆమె పార్తివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. […]